2029 లో ప్రధానిగా మోదీ..ప్రతిపక్ష హోదాలో భారత్ కూటమి..అమిత్ షా

2029లో 'భారత్' కూటమి తిరిగి ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటుందని మోదీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.చండీగఢ్ లోని ఓ తాగునీటి ప్రాజెక్ట్ ప్రారంభంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 

New Update
2029 లో ప్రధానిగా మోదీ..ప్రతిపక్ష హోదాలో భారత్ కూటమి..అమిత్ షా

2029లో 'భారత్' కూటమి తిరిగి ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటుందని మోడీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.చండీగఢ్ లోని ఓ తాగునీటి ప్రాజెక్ట్ ప్రారంభంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 

చండీగఢ్‌లో తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించిన అమిత్ షా ఇలా అన్నారు. 2029లో ప్రతిపక్ష శ్రేణిలో కూర్చోవడానికి భారత కూటమి సిద్ధంగా ఉండాలి. 2029లో మోదీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్న సంగతి ప్రతిపక్ష పార్టీలకు తెలియదు.
అందుకే బీజేపీ ప్రభుత్వం కొనసాగదని అంటున్నారు. బీజేపీ ఈ పదవీకాలాన్ని పూర్తిగా పూర్తి చేస్తుందని, వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం నాకుంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలో వారు నేర్చుకోవాలి. ఈ విధంగా ఆయన మాట్లాడారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న తన ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ వరకు సమయం ఇవ్వాలని ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని కోరాడు. మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చామని.. మధ్యలోనే వెళ్లిపోమంటున్నారని ఆవేదన చెందాడు. చికిత్సకు ఇప్పటికే రూ.కోటి ఖర్చు అయ్యిందన్నారు.

New Update
Surgeries

Surgeries

తన ఇద్దరు పిల్లల ఆపరేషన్ కోసం ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. పుట్టుక నుంచి తన ఇద్దరు పిల్లలు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చారు. ఇప్పుడు పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ కాకుండానే మధ్యలో వెళ్లాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. 

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

కొంత సమయం ఇవ్వాలని..

చికిత్స పూర్తి చేయడానికి అనుమతించాలని ప్రభుత్వాలను కోరాడు. ఢిల్లీలో అధునాతన చికిత్స ఉందని, అందుకే చికిత్సకు ఇండియాకు వచ్చినట్లు తెలిపాడు. ఇంకో వారం రోజుల్లో శస్త్రచికిత్స జరగనుంది. అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే పిల్లల వైద్యానికి రూ.కోటి ఖర్చు అయ్యిందని, ఇప్పుడు మధ్యలోనే చికిత్స ఆపేస్తే.. పిల్లల ప్రాణాలకే ప్రమాదమని తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఇంకో రెండు వారాల సమయం ఇస్తే చికిత్స అన్ని పూర్తి చేసుకుని వెళ్లిపోతామని తండ్రి ప్రభుత్వాన్ని కోరాడు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు