YCP MLC : జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ?

AP: జగన్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్సీ జకీయా ఖానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. విజయవాడలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ని కలిసి.. సన్మానించారు. దీంతో ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది.

New Update
YCP MLC : జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ?

YCP MLC Zakia Khanam : ఎన్నికల్లో (Elections) ఓటమి చెందిన మాజీ సీఎం జగన్‌ (Ex. CM Jagan) కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ (YCP) కి రాజీనామా చేసే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్సీ జకీయా ఖానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. విజయవాడలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ (NMD Farooq) ని కలిశారు శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకీయా ఖానం (Zakia Khanam). మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను సన్మానించారు. దీంతో ఆమె త్వరలో వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కాగా పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించకపోవడంతో ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే, మరి ఆమె పార్టీ మారుతారా? లేదా? అనేది వేచి చూడాలి.

Also Read : భారత్ లో నియంత్రణలోనే జనాభా పెరుగుదల.. పాప్యులేషన్ పై స్పెషల్ స్టోరీ

publive-image మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌తో వైసీపీ ఎమ్మెల్సీ జకీయా ఖానం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారని చెప్పారు. 

author-image
By Manogna alamuru
New Update
MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ దువ్వాడపై మొత్తానికి వేటు పడింది. గత కొన్ని రోజలుగా వార్తల్లో నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పై ఎట్టకేలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చర్యలు తీసుకున్నారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పినట్లు ఫిర్యాదులు రావడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 

జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే..

పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే దువ్వాడను సస్పండ్ చేశారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్ ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జి పేరాడ తిలక్ కి మద్దతు తెలపమని జగన్ అడిగారు. కానీ దీనికి దువ్వాడ ఒప్పుకోలేదు. దీంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారని చెబుతున్నారు. నాయకుడు చెప్పిన వెంటనే సస్పెన్షన్ ను అమలు చేసింది పార్టీ కేంద్ర కమిటీ.  దీంతో ఇప్పటి వరకు జగనే నా దేవుడు అన్న దువ్వాడ దారెటో అని పార్టీ జనాలు అనుకుంటున్నారు. ఇతని సస్పెన్షన్ తో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా పరిణించాయని..ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాణి హాస్తం వుందని మాట్లాడుకుంటున్నారు. 

 

ap
Mlc Duvvada suspention

 

 

 today-latest-news-in-telugu | duvvada-srinivas | ycp | suspend

Also Read: J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

 

Advertisment
Advertisment
Advertisment