Raja Shingh: చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్ వస్తోందని, తన ప్రతీ అడుగు వారికి తెలిసిపోతుందని, తన ప్రోగ్రామ్స్ అన్నీ వారు ముందుగానే చెప్పేస్తున్నారు అంటూ ఫిర్యాదులో ఆరోపించారు రాజాసింగ్. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌తో పాటు.. రాష్ట్ర డీజీపీకి కూడా లేఖ రాశారు రాజాసింగ్.

New Update
Raja Shingh: చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..

Threatening Calls to BJP MLA Raja Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్‌కు ప్రాణ హాని ఉందా? ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయా? ఆ అగంతకులు రాజాసింగ్ ప్రతి అడుగును అబ్జర్వ్ చేస్తున్నారా? ఆయన పర్యటన షెడ్యూల్‌ను ముందే చెప్పేస్తున్నారా? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఆయనను చంపే కుట్ర ఏమైనా చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్(MLA Raja Singh). తనను చంపేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్ వస్తోందని, తన ప్రతీ అడుగు వారికి తెలిసిపోతుందని ఫిర్యాదులో ఆరోపించారు రాజాసింగ్. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌తో పాటు.. రాష్ట్ర డీజీపీకి కూడా లేఖ రాశారు రాజాసింగ్. తనకు 15 డిజిట్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని, చంపుతాం, నరుకుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే తొలిసారి కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయని చెప్పారు రాజాసింగ్. తన గురించి, తన ప్రతి మూమెంట్ గురించి కాల్ చేసి చెప్తున్నారని ఆరోపించారు రాజాసింగ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ తన నియోజకవర్గానికి వస్తున్నారని, ఆ సమయంలో తమ ఇద్దరినీ కలిసి చంపేస్తామని భయపెడుతున్నారని అన్నారు రాజాసింగ్. లేఖ మాత్రమే కాదు.. ఈ మేరకు ఒక వీడియో కూడా విడుదల చేశారు.

ఇదికూడా చదవండి: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం..

తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ రాసిన లేఖ సారాంశం యధావిధంగా..

'నేను టి. రాజా సింగ్, గోషామహల్ ఎమ్మెల్యే. ఈరోజు, సుమారు మధ్యాహ్నం 1:59 గంటలకు, +619664800063233 నంబర్ నుండి నా వ్యక్తిగత నంబర్ 9000214000 కి కాల్ వచ్చింది. 6 నిమిషాలు మాట్లాడిన ఈ కాల్‌లో ఓ వ్యక్తి రాబోయే ఎన్నికల కౌంటింగ్ లోపు నాకు, నా కుటుంబానికి హాని కలిగించాలనే ఉద్దేశ్యంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. న‌న్ను చంప‌డానికి ప్లాన్‌ చేశానన్నారు. అంతేకాకుండా, త్వరలో జరగనున్న నా గోషామహల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నన్ను, ప్రచారానికి వస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి హాని కలిగిస్తామని కూడా బెదిరించారు.ఈ విషయంపై పోలీసులు శాఖాపరంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఇప్పటికే నా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని, పాదయాత్రను ప్రారంభించాను. ఎన్నికల సంబంధిత ప్రయోజనాల కోసం గణనీయమైన సంఖ్యలో ప్రజలు నా కార్యాలయాన్ని సందర్శిస్తున్నారు. నాకు గతంలో బెదిరింపు కాల్‌లు వచ్చినప్పటికీ, అధికారులు ఈ ప్రత్యేక ముప్పును పరిష్కరించడం అత్యవసరం. ప్రత్యేకించి యూపీ సీఎం యోగి ని లక్ష్యంగా చేసుకున్న ప్రస్తావన కారణంగా వెంటనే చర్యలు తీసుకోండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు డైరెక్టర్ జనరల్, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తారని విశ్వసిస్తున్నాను.' అని లేఖలో పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: ఇలా చేస్తే చంద్రబాబుకు ఈజీగా బెయిల్‌ వచ్చేది.. ఉండవల్లి అరుణ్ సంచలన కామెంట్స్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.

New Update
danam nagender brs

danam nagender brs

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  ఎప్పటినుండో కేసీఆర్‌ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని..   సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు.  హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.  

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

వ్యక్తిగతంగా బాధించింది

అయితే  రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు.  కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.  ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్  తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

Advertisment
Advertisment
Advertisment