MLA Harish Rao: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేము నిద్రపోము అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు.

New Update
MLA Harish Rao: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

MLA Harish Rao: పటాన్‌చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. 2001లో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారని అన్నారు. అప్పుడు కూడా కుట్రలు జరిగాయని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన 12మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడని.. కానీ కుట్రలు ఫలించలేదని అన్నారు. న్యాయం గెలిచిందని... కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు.

బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనన్న వాళ్లు తర్వాత కనిపించకుండా పోయారని చురకలు అంటించారు. పార్టీకి కష్టాలు వస్తాయని.. మీరు ధైర్యంగా ఉండండి. మీ బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని అన్నారు. ఎమ్మెల్యే పోతే పార్టీ పోదు.. పటాన్‌చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ ఎగిరేది గులాబి జెండానే అని అన్నారు.

హరీష్ రావు కామెంట్స్..

* మీరందరూ కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారు. పటాన్‌చెరుకు ఏం కావాలంటే అది ఇచ్చాం. రోడ్లు, తాగునీళ్లు, స్టేడియం వంటి ఎన్నో అందించాం. నిధులు వరద పారించాం.
* గూడెం పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు నిద్రపోం.
* మహిపాల్‌ రెడ్డికి మూడుసార్లు టికెట్లిచ్చి గెలిపిస్తే పార్టీ మారడానికి మనసెలా వచ్చింది? ఇది న్యాయామా? నీకిది తగునా?
* వైసీపీ నీకు టికెట్ ఇవ్వకపోతే తల్లిలా దగ్గరికి తీసుకుని నీకు టికెట్ ఇచ్చింది పార్టీ.
* కార్యకర్తలకు ధైర్యం చెప్పుదాం అని వచ్చిన నాకే మీరు వేలాది మందిగా తరలివచ్చి ధైర్యం చెప్పారు.
* పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుందాం. మళ్లీ గులాబీ జెండా ఎగిరేవరకు కష్టపడి పనిచేద్దాం.
* ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలందరూ చూస్తున్నారు. కేసీఆర్ పాలనను, కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటున్నారు.
* పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న రేవంత్ తనే ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నాడు.
* జీవోలో రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ అని చెప్పారు. వ్యతిరేకత వస్తోందని మాట మార్చుతున్నారు. పాస్ బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటతో చెప్తున్నావు. అదే నిజమైతే జీవో మార్చు.
* వడ్లకు బోనస్ అని తర్వాత సన్నవడ్లకే బోనస్ అంటూ 90 శాతం రైతులకు బోనస్ ఎగ్గొట్టావు.
* ఇప్పుడు రుణ మాఫీ విషయంలోనూ అదే చేస్తున్నారు.
* PM కిసాన్ నిబంధనలు ఎందుకు..? రేషన్ కార్డు నిబంధనలు ఎందుకు..?
* ఆరు నూరైనా సరే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే.

Advertisment
Advertisment
తాజా కథనాలు