Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తోనే ఉంటా.. మా మధ్య ఉన్నది అదే.. క్లారిటీ ఇచ్చిన దివ్వల మాధురి తాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తోనే ఉంటానన్నారు దివ్వల మాధురి. తనపై వచ్చే విమర్శల కంటే తాను శ్రీనుతో ఉండడమే బెటర్ అని అంటున్నారు. దువ్వాడతో తనకు ఉన్న ఫ్రెండ్షిప్ భవిష్యత్లో ఎక్కడికైనా దారి తీయొచ్చన్నారు. దువ్వాడ భార్య వాణి ఆరోపణలు అర్థరహితమన్నారు. By Jyoshna Sappogula 09 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) భార్య వాణి ఆరోపణలకు దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు గైడ్, కేర్ టేకర్, ఫిలాసఫర్ అని.. దువ్వాడ భార్య వాణి ఆరోపణలు అర్థరహితం అని అన్నారు. సూసైడ్ చేసుకోబోతుంటే దువ్వాడ చేరదీశారని తనకు దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు. Also Read: మీ వివరణ తలా తోక లేనిది.. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఫైర్! తనను దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి పాలిటిక్స్లో ఓ పావులా వాడుకుందని.. పాలిటిక్స్లో తనను వాణి ట్రాప్ చేసిందని మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు తాను చాలా దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా ఆరోపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు..నా లైఫ్ను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు..నేను దువ్వాడ శ్రీనివాస్తోనే ఉంటా.. శ్రీనివాస్తో నాది ఫ్రెండ్షిప్ అనుకోండి..దువ్వాడ తనకు వివాహేతర సంబంధం అనే మచ్చ పోదు, రాష్ట్రమంతా ప్రచారం జరిగిందని..ఈ విమర్శల కంటే శ్రీనుతో ఉండడమే బెటర్' అని ఆమె ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు శ్రీనివాస్ అండగా ఉంటానని చెప్తున్నారని..ఈ ఫ్రెండ్షిప్ భవిష్యత్లో ఎక్కడికైనా దారి తీయొచ్చని మాధురి క్లారిటీ ఇచ్చారు. #mlc-duvvada-srinivas #madhuri సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి