Uttam Kumar Reddy: కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్
TG: విద్యుత్ ఉత్పత్తిని పెంచినట్లు చెప్పడంలో వాస్తవం లేదని అన్నారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్, మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవని తేల్చి చెప్పారు.
Uttam Kumar Reddy: విద్యుత్ ఉత్పత్తిని పెంచినట్లు చెప్పడంలో వాస్తవం లేదని అన్నారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్, మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవని తేల్చి చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్కు పాత సాంకేతికత వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుందని అన్నారు.
🔴Pahalgam Terrorist Attack: మీ దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను.. పహల్గా మృతులకు స్మితా నివాళి
జమ్ము కశ్మీర్లో అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
జమ్ము కశ్మీర్(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్డేట్స్ను ఇక్కడ ఫాలో అవ్వండి.
నీళ్ల నుంచి వ్యాపారం వరకు.. భారత్ నిర్ణయంతో పాక్ కు చుక్కలే.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే?
కాశ్మీర్లోని ఉగ్రదాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని అంటోంది భారత్. దీన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ కు సంబంధించి ఐదు నిర్ణయాలను తీసుకుంది. వీటితో ఆ దేశం అన్ని రకాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు.
India-Pakistan
Apr 24, 2025 10:10 IST
ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో సంబంధం లేనప్పుడు పాక్ ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. దీనిని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదని అడిగారు.
Danish Kaneria
Apr 24, 2025 10:09 IST
మీ దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను.. పహల్గా మృతులకు స్మితా నివాళి
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాళులు అర్పించారు. ‘‘ ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు స్మితా సబర్వాల్ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారి దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు.
Smita Sabharwal
Apr 24, 2025 10:08 IST
టీమిండియా హెడ్ కోచ్కు చంపేస్తామంటూ బెదిరింపులు
టీమిండియా హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఐసిస్ కశ్మీర్ నుంచి వచ్చినట్లు గౌతమ్ గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు.
Gautam Gambhir Photograph: (Gautam Gambhir)
Apr 24, 2025 10:07 IST
కావలి చేరుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం
నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెహల్గామ్ లో ఉన్మాద ఉగ్రవాదుల చేతులో కావలి కి చెందిన మధుసూధనరావు హతమయ్యారు. దీంతో ఆనాలవారి వీధిలోని మధుసూదనరావు నివాసం వద్ద విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కాగా ఆయన మృతదేహం కావలికి చేరుకుంది.
Body of software engineer Madhusudhan
Apr 24, 2025 10:06 IST
ఉగ్రదాడి వేళ.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకుల వద్ద ఎలాంటి రుసుం తీసుకోకుండానే ఉచితంగానే వాళ్ల గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు ఫ్రీగానే ఆశ్రయం కల్పిస్తున్నారు.
Kashmiris' generosity during terror attacks, Free transport for tourists
Apr 24, 2025 10:05 IST
హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు
టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారు. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు.
Apr 24, 2025 10:03 IST
AK 47గన్ తో కాల్చారు.. మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుసూదన్ రావు నెల్లూరు జిల్లా కావలి కి చెందిన వ్యక్తి శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది, ఏకే 47 గన్ తో వెంటాడి వేటాడి చంపారు. 💥💥
— CHALLA VENU GOPAL YADAV (నేను మోదీ గారి కుటుంబం) (@VENUYADAV4BJP) April 23, 2025
Apr 24, 2025 10:01 IST
టిఆర్ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్లైన్లో యువకుల రిక్రూట్మెంట్!
పహల్గాం దాడి చేసింది తామేనని TRF ప్రకటించింది. కానీ దీనివెనక లష్కర్ ఈ తోయిబా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఖలీద్ అనే మారుపేరుతో తిరుగుతున్న సైఫుల్లా ఈ దాడికి కుట్రపన్నినట్లు సమాచారం. 2023లో TRFను భారత్ 'ఉగ్రవాద సంస్థ'గా పేర్కొంటూ నిషేధం విధించింది.
Apr 24, 2025 10:01 IST
ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత
కల్మా అంటే ఏంటీ.. అది చదవనందుకు ఉగ్రవాదులు ఎందుకు చంపేశారు?
ఇస్లాంలో కల్మా అనేది అల్లాహ్ యొక్క ఏకత్వం. విశ్వాసాన్ని ధృవీకరించే విశ్వాస ప్రకటన. ముస్లింలు కల్మాను క్రమం తప్పకుండా పఠించడం అనేది అల్లాను మాత్రమే ఆరాధించడం. ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం పట్ల తమకున్న నిబద్ధతను గుర్తుచేసుకోవడానికి ఒక మార్గం.
Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!
Apr 24, 2025 09:38 IST
నెలల తరబడి డబ్బు కూడబెట్టి కశ్మీర్ పర్యటన.. 9ఏళ్ల కొడుకు ముందే ప్రశాంత్ కలను కాలరాసిన ఉగ్రవాదులు!
పహల్గాం ఉగ్రదాడి ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నెలల తరబడి డబ్బు కూడబెట్టి ఫ్యామిలీతో కశ్మీర్ పర్యటన వెళ్లిన ప్రశాంత్ను 9ఏళ్ల కొడుకు, భార్యముందే కాల్చి చంపేశారు. అతని మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Apr 24, 2025 09:37 IST
Fauji ఉగ్రవాదులు దాడి.. ప్రభాస్ హీరోయిన్ బలి!
పహల్గామ్ ఎటాక్ తో ప్రభాస్ ఫౌజీ మూవీపై వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాకిస్థానీ మిలటరీ ఆఫీసర్ కూతురు కావడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. శత్రుదేశాల మూలాలున్న అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారు అనే కోణంలో కొందరు నిరసన స్వరం వినిపిస్తున్నారు.
fauji heroine
Apr 24, 2025 09:35 IST
BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?
కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో భవిష్యత్తులో పాకిస్తాన్తో ఎలాంటి మ్యాచ్లు ఆడవద్దని బీసీసీఐని అభిమానులు కోరుతున్నారు. దీనిపై బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఏది చెబితే అది జరుగుతుందన్నారు.
Apr 24, 2025 09:33 IST
ఏప్రిల్ 22 ఒక చీకటి రోజు:.. ఉగ్రవాద దాడిపై బాలీవుడ్ సెలెబ్రెటీల ట్వీట్లు
పహల్గామ్ ఉగ్రవాద దాడి పై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. షారుక్ తో పాటు అనుష్కశర్మ, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ తదితరులు దాడిపై స్పందించారు.v
pahalgam attack Bollywood stars tweets
Apr 24, 2025 08:26 IST
కర్రె గుట్టలపైకి డ్రోన్లు.. ఒకే బంకర్లో 3వేల మంది మావోయిస్టులు: మరికొన్ని గంటల్లో భీకర యుద్ధం!
మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగుతోంది. గుట్టలపై డ్రోన్లు ఎగరవేసిన పోలీసులు దాదాపు 3వేల మంది మావోయిస్టులున్నట్లు అంచనా వేస్తున్నారు. 4వేల మంది భద్రతాబలగాలు కూబింగ్ నిర్వహిస్తుండగా ఏ క్షణమైనా భీకర యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది.
Apr 24, 2025 08:24 IST
పహల్గామ్ లో బిగ్ బాస్ నటి కాజల్.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే!
బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉండడం ఆమె అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది.
rj kajal in Pahalgam attack
Apr 24, 2025 08:21 IST
ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం అలర్ట్ అయింది. అత్యంత శక్తివంతమైన ధ్రువ్ హెలికాప్టర్లలో ఒకదాన్ని శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో ఎగరడానికి అనుమతించింది.
Apr 24, 2025 08:20 IST
పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ అటాక్ భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనపై హీరో విజయ దేవరకొండ స్పందిస్తూ.. రెండేళ్ల క్రితం తన బర్త్ డే వేడుకలను ఆ ప్రదేశంలో జరుపుకున్నానని. ఇప్పుడు అక్కడ ఇలాంటి ఘటన జరగడం మనసును కలచివేస్తోంది అని పోస్ట్ పెట్టారు.
vijay devarakonda on Pahalgam attack
Apr 23, 2025 21:25 IST
BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్ కు బిగ్ షాక్!
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లుగా వెల్లడించింది. పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
modi-amit-shah
Apr 23, 2025 20:03 IST
J&K Terror Attack : రివేంజ్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. అదుపులో 1500 మంది!
జమ్మూకశ్మీర్ లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. అయితే ఈ కాల్పుల వెనుక పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
terror attack in j and k
Apr 23, 2025 20:00 IST
Pahalgam Attack: కల్మా అంటే ఏంటీ.. అది చదవనందుకు ఉగ్రవాదులు ఎందుకు చంపేశారు?
ఇస్లాంలో కల్మా అనేది అల్లాహ్ యొక్క ఏకత్వం. విశ్వాసాన్ని ధృవీకరించే విశ్వాస ప్రకటన. ముస్లింలు కల్మాను క్రమం తప్పకుండా పఠించడం అనేది అల్లాను మాత్రమే ఆరాధించడం. ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం పట్ల తమకున్న నిబద్ధతను గుర్తుచేసుకోవడానికి ఒక మార్గం.
kalma islam
Apr 23, 2025 19:59 IST
Pahalgam Attack: భయం గుప్పిల్లో కశ్మీర్ పర్యాటకులు.. 6గంటల్లో ఎన్నివేల మంది వెళ్లిపోయారంటే!
పహల్గాం ఘటన పర్యాటకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. టూరిస్టులు ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వదిలి పరుగులు తీస్తున్నారు. గడిచిన 6గంటల్లో దాదాపు 4వేల మంది తిరుగు పయణమయ్యారు. ప్రత్యేక విమానాలతోపాటు అన్నిఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
jammu Photograph: (jammu )
Apr 23, 2025 19:58 IST
PM Modi : ఉగ్రవాదుల్ని ఏరిపారేద్దాం.. మోదీ ఇంట్లో హై లెవెల్ మీటింగ్!
పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి న్యూఢిల్లీలోని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ లు పాల్గొన్నారు.
Prime Minister narendra modi chairs Cabinet Committee on Security (CCS) meeting in New Delhi on Pahalgam terror attack in Kashmir and response from India against Pakistan. pic.twitter.com/mczivVaoSK
— Saurabh Bhadouria (सौरभ भदौरिया) (@Bhadourialive) April 23, 2025
Apr 23, 2025 17:35 IST
ఉగ్రదాడి.. శ్రీనగర్-జమ్మూ హైవేపై భారీగా బలగాల మోహరింపు
పహల్గామ్ దాడిలో అమరవీరుడైన నేవీ అధికారి భార్య హిమాన్షి ఆయనకు తుది వీడ్కోలు పలికారు. తన భర్త మృతదేహాన్ని ఉంచిన శవపేటికను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడుస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హార్స్ రైడర్ హుస్సేన్ షాకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. పర్యాటకులకోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా విరోచితంగా పోరాడిన హుస్సేన్ను హీరోగా కీర్తిస్తున్నారు. అతనిమీదే ఆధారపడి బతుకున్న కుటుంబం మాత్రం రోధిస్తోంది.
Rajnath Singh: ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది: రాజ్నాథ్ సింగ్ సంచలన కామెంట్స్
భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పహల్గాంలో ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు. పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు.
rajnath-singh
Apr 23, 2025 16:27 IST
Pahalgam Terror Attack: నీకు సిగ్గుందరా.. లవ్ యూ పాకిస్థాన్ అంటూ పోస్ట్ .. తిక్క కుదిర్చిన పోలీసులు!
ఉగ్రదాడి వేళ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్ మిలత్ నగర్ కు చెందిన మహమ్మద్ నౌషద్ అనే యువకుడు తన సోషల్ మీడియాలో 'థాంక్యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్ -ఇ-తోయిబా' అని పోస్ట్ చేశాడు.
జమ్మూ అండ్ కశ్మీర్లోని పహల్గామ్ అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దీనిని ‘‘మినీ స్విట్జర్లాండ్’’ అని కూడా అంటారు. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన చెట్లు, పచ్చని లోయలు ఉంటాయి. ట్రెక్కింగ్ ఇష్టపడే టూరిస్టులకు స్వర్గధామం..
Apr 23, 2025 16:25 IST
Pahalgam Terrorist Attack: ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హిందూ ప్రొఫెసర్.. ఉగ్రవాదులకు ఏం చెప్పాడంటే?
ఉగ్రవాద దాడిలో ఓ హిందూ ప్రొఫెసర్ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అతను ఉగ్రవాదులను చూసిన వెంటనే కల్మా అనే ఇస్లామిక్ శ్లోకాన్ని పఠించడం ప్రారంభించాడు. దీంతో కృతజ్ఞతగా ఉగ్రవాదులు తమ మనసు మార్చుకుని అతన్ని చంపకుండా వదిలేశారు.
Hindu professor
Apr 23, 2025 15:55 IST
పహల్గాం ఉగ్రదాడి బాధితుల కోసం ఢిల్లీ ఏపీ భవన్ లో ఎమర్జెన్సీ డెస్క్
పహల్గాం ఉగ్రదాడి బాధితుల కోసం ఢిల్లీ ఏపీ భవన్ లో ఎమర్జెన్సీ డెస్క్ ఏర్పాటు చేశాం. బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎటువంటి సహాయం అవసరం అయినా 9818395787 నంబర్ కు కాల్ చేయండి#PahalgamTerroristAttackpic.twitter.com/G7JA8s8Xdz
లెఫ్ట్నెంట్ వినయ్ కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నివాళి
#WATCH | Delhi CM Rekha Gupta pays last respects to Indian Navy Lieutenant Vinay Narwal, who was killed in the Pahalgam terror attack yesterday pic.twitter.com/KkynFT3w4a
Pahalgam Terrorist Attack: POKలో స్కెచ్..రెండు వారాల క్రితం భారత్ లోకి ఎంట్రీ.. పహల్గాం దాడికి ఆ దుర్మార్గులు ఎలా ప్లాన్ చేశారంటే?
పర్యాటకులపై దాడి సమయంలో ఉగ్రవాదులు తమ హెల్మెట్లపై కెమెరాలు ధరించారు. తద్వారా మొత్తం సంఘటనను వీడియో చిత్రీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తమ సంస్థకు పంపారు. కొంతమంది ఉగ్రవాదులు స్నిపర్ కాల్పుల మాదిరిగా దూరం నుండి కాల్పులు జరిపారు.
pok attack
Apr 23, 2025 15:30 IST
Pahalgam Terrorist Attack: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?
జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పాక్ ఈ దాడి చేయించిందని అధికారులు అంటున్నారు. ఇది కశ్మీర్లో వేలాది కుటుంబాలను ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల రాకతోనే జీవనోపాధి పొందుతున్నవారి జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి.
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం అలర్ట్ అయింది. అత్యంత శక్తివంతమైన ధ్రువ్ హెలికాప్టర్లలో ఒకదాన్ని శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో ఎగరడానికి అనుమతించింది.
ALH Dhruv choppers
Apr 23, 2025 15:28 IST
J&K Terror Attack: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!
జమ్మూకశ్మీర్ లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. అయితే ఈ కాల్పుల వెనుక పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
terror attack in j and k
Apr 23, 2025 15:27 IST
Telangana: శ్రీనగర్లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు
తెలంగాణ జిల్లాల నుంచి పలువురు శ్రీనగర్కు పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో ఉగ్రదాడి జరడంతో వీళ్లు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ ఓ హోటల్లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యటకులు చిక్కుకుపోయారు.
Pahalgam Terrorist Attack: విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్.. నేడు జేడీ వాన్స్!
దేశంలో విదేశీ అతిథుల పర్యటన సమయంలోనే ఉగ్రదాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జరగ్గా.. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పర్యటనలో ఉండగా జరిగింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఈ దాడులు చేశాయని భావిస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఈ ఉగ్రదాడి కదలికలపై ముందే హెచ్చరించినా కూడా అధికారులు దీన్ని ఆపడంలో విఫలమయ్యారా ? అనే సందేహాలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం టైటిల్ పై క్లిక్ చేయండి.
Amit shah
Apr 23, 2025 15:25 IST
Pahalgam Terrorist Attack: ఆ దుర్మార్గులను వదిలిపెట్టం.. దేశం మొత్తానికి ఇదే నా హామీ.. అమిత్ షా సంచలన ప్రకటన!
పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రదాడిని చూసి ప్రతీ భారతీయుడు బాధను అనుభవిస్తున్నాడని.. దీన్ని వర్ణించలేమని అన్నారు. అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులందరినీ వదిలిపట్టేది లేదని స్పష్టం చేశారు.