Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన స్థలం సరికాదని మంత్రి ఉత్తమ్ అన్నారు. డిజైన్‌, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్లే మేడిగడ్డ కొంగినట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌ పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని అన్నారు.

New Update
Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar Reddy: నీటి పారుదల రంగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన సభలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) నిర్మించిన స్థలం సరికాదని అన్నారు. వైట్‌పేపర్‌లో నేషనల్‌ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఇచ్చిన నివేదికను పొందుపరిచినట్లు తెలిపారు. డిజైన్‌, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్లే మేడిగడ్డ కుంగిందని అన్నారు. రాఫ్ట్ కుంగడంతో పియర్స్‌కు కూడా కుంగిపోయాయని తెలిపారు.

ALSO READ: ప్రమాదంలో అన్నారం బ్యారేజ్‌.. నీళ్లు లీక్!

మేడిగడ్డ బ్యారేజ్‌ పునరుద్ధరణ సాధ్యం కాదు..

మేడిగడ్డలోని ఏడో బ్లాక్‌లో పియర్స్‌కు నిట్టనిలువునా చీలిక వచ్చిందని అన్నారు. ఏడో బ్లాక్‌లో 20వ పియర్‌ పూర్తిగా కుంగిపోయిందని పేర్కొన్నారు. 21 నుంచి 16వ పియర్‌ వరకు పారాపెట్‌ గోడ కుంగిపోయిందని అన్నారు. బ్యారెజ్‌ కట్టిన తర్వాత ఎలాంటి తనిఖీలు, మెయింటెనెన్స్‌ చేయలేదని అన్నారు. 2022లో వరదల కారణంగా అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌లు మునిగాయని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌ పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

90 శాతం ఫెయిల్‌

అగ్రిమెంట్ ప్రకారం ఎల్‌ అండ్ టీ నిర్మాణ పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. పనులు కానప్పటికీ ఏజెన్సీకి నిధులు విడుదల చేయాలని రామగుండం ENC లేఖ. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ. 93 వేల 872 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్లాన్ అని.. నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకోవడంలో ప్రాజెక్టు 90 శాతం ఫెయిల్‌ అయిందని పేర్కొన్నారు.

ఏపీకి ఎక్కువ..

కాళేశ్వరం ద్వారా 98 వేల 890 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో ఎత్తిపోసిన నీళ్లన్ని సముద్రం పాలయ్యాయని అన్నారు. అంటే నీటిని ఎత్తిపోసేందుకు అయిన ఖర్చు మొత్తమంతా వృథానే అని అన్నారు. ఏపీ అధిక నీటి వినియోగాన్ని అడ్డుకోవడంలో గత ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీ 100 టీఎంసీలు అధికంగా ఉపయోగించుకుందని వెల్లడించారు.

ALSO READ: కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్.. ముఖ్యనేతలతో భేటీ!

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

New Update
Jammu Kashmir

Jammu Kashmir

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు సమాచారం.

Also Read:BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

జమ్మూ కశ్మీర్‌ లో పని చేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లినవారే.దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్‌ ల నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

మరోవైపు కశ్మీరీ పండిట్‌ల లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.వీరితో పాటు శ్రీనగర్‌,గాందెర్బల్‌ జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉదన్న వార్తల నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.

రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Also Read:Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

jammu-kashmir | jammu kashmir attack | latest-news | latest-telugu-news | latest telugu news updates | attack in Pahalgam | Pahalgam attack | army

 

Advertisment
Advertisment
Advertisment