Seediri Appalaraju: ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు: సీదిరి అప్పలరాజు

పొత్తుల కోసం పాకులాడటమే ప్రతిపక్షాల పని అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఓటమి భయంతోనే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Seediri Appalaraju: ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు: సీదిరి అప్పలరాజు

Minister Seediri Appalaraju: తన ఆరు వందల కోట్ల రూపాయలు టీడీపీ వారు దొంగలించారని షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. వాటిని వెతికే పనిలో నిమగ్నమై ఉన్నానన్నారు. ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు పొత్తుల కోసం పాకులాడటమే పని అంటూ విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే పొత్తుల కోసం వేంపర్లాడుతున్నారన్నారు. లోకేష్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని చెప్పుకొచ్చారు.

Also Read: టికెట్లు అడిగే వారేలేరు .. బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే ఊరుకోను: బుద్ధా వెంకన్న

గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్ల కంటే వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో సీఎం జగన్ కు ఉన్న ఆదరణ చూసీ ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమేనన్నారు. సంక్షేమాల పథకాలతో ప్రజల్లో వైసీపీకి మంచి పేరు ఉందని వ్యాఖ్యానించారు. కానీ, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని కావాలనే టీడీపీ జనసేన విమర్శలు చేస్తున్నారని కామెంట్స్ చేశారు. కేవలం రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం కేంద్రం పెద్దలను జగన్ కలిశారని వివరించారు.

Also Read: గోదావరిఖనిలో దొంగల బీభత్సం.. రూ.27 లక్షలకు పైగా చోరీ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు