Minister Satya Kumar: ఏపీ మంత్రి ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్

AP: ఓటమి తరువాత కూడా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదన్నారు మంత్రి సత్యకుమార్. బీఆర్ఎస్ హయాంలో అవినీతిని ప్రశ్నిస్తే నాలుగు ఏళ్ల కిందట ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ తనను ట్విట్టర్ (X)లో బ్లాక్ చేశారని చెప్పారు. జగన్ ఓటమిని కేటీఆర్ తట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

New Update
Minister Satya Kumar: ఏపీ మంత్రి ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్

Minister Satya Kumar: ఏపీలో వైసీపీ ఓటమి దిగ్భ్రాంతి కలిగించిందని, ముఖ్యంగా ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని, కేతిరెడ్డి వంటి వ్యక్తి ఓడిపోవడం ఏంటని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు.

ఆయన ట్విట్టర్ (X)లో.. "ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా మాదిరే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు, కొండలను కూడా అతడు కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా... కలెక్షన్... కరప్షన్... కమీషన్లే! ఫాంహౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగినా అతడి గురించి ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు నాలుగు సంవత్సరాల క్రితం నన్ను ఎక్స్ (ట్విట్టర్) లో బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియమిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు 'సర్టిఫికెట్' లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి" అంటూ ఎద్దేవా చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు