Jagadish Reddy: వార్ వన్ సైడే...సూర్యాపేట నాదే...ఆర్టీవీతో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

బీజేపీని నాశనం చేసిందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల్లో ఎలాంటి సీన్ రిపీట్ అయ్యిందో..ఈ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు ప్రజలు కంకణం కట్టుకుని సిద్ధంగా ఉన్నారని జగదీశ్ రెడ్డి.

New Update
Jagadish Reddy: వార్ వన్ సైడే...సూర్యాపేట నాదే...ఆర్టీవీతో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే కోతులే సిగ్గుపడేలా ఉన్నాయన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఏడాదిలో రెండు పార్టీలు మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ...కాంగ్రెస్ పార్టీ...సోనియాగాంధీపై విమర్శలు చేసి...మళ్లీ అదే పార్టీలో చేరడం సిగ్గుచేటన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏం ఉద్దరించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. పదవులకోసం ఏదైనా మార్చే శక్తి కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఏం జరిగిందో అదే ఇప్పుడు రిపీట్ అవుతుందన్నారు. ఈ పరాన్నజీవులకు ప్రజల్లో ఓటమి ఖాయమంటున్న మంత్రి జగదీశ్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ వీడియోను చూడండి.

ఇది కూడా చదవండి: దీపావళికి ముందు ఈ నాలుగు రాశుల వారు పట్టిందే బంగారం..డబ్బులు డబుల్ అయ్యే అవకాశం..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు