Minister Botsa: బొత్సకు వైసీపీ ఫ్యామిలీ ప్యాకేజీ.. మూడు ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాల్లో మంత్రి బలగం! మంత్రి బొత్సకు వైసీపీ ఫ్యామిలీ ప్యాకేజీ ప్రకటించింది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స సతీమణి ఝాన్సీని దింపాలని ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకోగా.. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుని రంగంలోకి దింపనుంది వైసీపీ. By Trinath 10 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి మంత్రి బొత్సకు వైసీపీ ఫ్యామిలీ ప్యాకేజీ ప్రకటించింది. ఇప్పటికే ఆయన కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బరిలో ఉండగా.. మరో ఇద్దరు ఎంపీలను కొత్తగా రంగంలోకి దింపేందుకు జగన్ సిద్ధమైనట్టు సమాచారం. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స సతీమణి ఝాన్సీని దింపాలని ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకోగా.. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుని రంగంలోకి దింపనుంది వైసీపీ. మొత్తం ఐదుగురు: ఇప్పటికే బోత్స కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గానికి మంత్రి బొత్స ఎమ్మెల్యేగా ఉండగా.. గజపతినగరం నుంచి బొత్స సోదరుడు అప్పలనరసయ్య ఉన్నారు. నెల్లిమర్ల నుంచి బొత్స మేనల్లుడు బడుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ మూడు స్థానాల్లో మళ్ళీ సిట్టింగులనే కొనసాగించే అవకాశం ఉంది. ఈ మూడు సీట్లు కేటాయిస్తూనే అదనంగా మరో రెండు ఎంపీ స్థానాల్లో బొత్స కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వనున్నారు. దీంతో వైసీపీలో బొత్స బలగం పెరిగింది. ఏ ఫ్యామిలీకి ఇవ్వనన్ని సీట్లు బొత్స కుటుంబానికి ఇవ్వనున్నారు. ALSO READ: నా దేశానికి బెస్ట్ ఇవ్వడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా..మహ్మద్ షమీ WATCH: #botsa-satyanarayana సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి