Minister Atchannaidu: వారికి రూ.5 లక్షలు.. మంత్రి కీలక ప్రకటన AP: మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే పార్టీ సభ్యత్వం ప్రారంభించనున్నట్లు చెప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకునే వారికి రూ.5లక్షల జీవిత బీమా అందించనున్నట్లు తెలిపారు. By V.J Reddy 08 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Minister Atchannaidu: టీడీపీ పొలిటికల్ బ్యూరో సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.అలాగే త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం ఉంటుందని అన్నారు. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి జాబితా చంద్రబాబు వద్ద ఉందని అన్నారు. అందరి మన్ననలు పొందేలా నామినేటెడ్ పోస్టుల జాబితా ఉంటుందని.. త్వరలోనే పార్టీ సభ్యత్వం ప్రారంభించనున్నట్లు చెప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకునే వారికి రూ.5లక్షల జీవిత బీమా అందించనున్నట్లు తెలిపారు. మూడు పార్టీలకు న్యాయం జరిగేలా.. నామినేటెడ్ పదవుల కోసం అనేకమంది ఎదురుచూస్తున్నారని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మూడు పార్టీలకు న్యాయం జరిగేలాగా నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. రాబోయే రోజులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయని.. ఇప్పుడు పదవి రాని వాళ్ళకి అప్పుడు న్యాయం చేస్తామని చెప్పారు. జనసేన బీజేపీ నేతలు కూడా నామినేటెడ్ పదవులు న్యాయం జరుగుతుందని అన్నారు. Also Read : నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలు! #minister-atchannaidu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి