Astrology : 2024 మే నెలలో ఈ 5 రాశులకు ధన యోగం..!

మే నెలలో నాలుగు ప్రధాన గ్రహాల సంచారం కారణంగా, కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.

New Update
Astrology : 2024 మే నెలలో ఈ 5 రాశులకు ధన యోగం..!

Grah Gochar 2024 : నవ గ్రహాలలో అత్యంత పవిత్రమైన గ్రహంగా, దేవతలకు గురువుగా పరిగణించబడే బృహస్పతి దాదాపు 13 నెలల తర్వాత మే 1వ తేదీన బుధవారం నాడు తన స్థానాన్ని మారనున్నాడు. అనంతరం మే 10వ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మే 14వ తేదీన సూర్యుడు మేష రాశి నుంచి వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. చివరగా మే 19వ తేదీన శుక్రుడు కూడా వృషభరాశిలోకి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మాళవ్య రాజయోగం, అంగారక రాజయోగం, గజ లక్ష్మీ రాజయోగం, గజకేసరి రాజయోగం, షష రాజ యోగం, శుక్రాదిత్య రాజ యోగాలు ఏర్పడనున్నాయి. మరోవైపు గురుడి ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రాశిచక్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి(Aries)

ఈ రాశి వారికి మే నెలలో గ్రహాల సంచారం వేళ శుభ ఫలితాలు రానున్నాయి. వ్యాపారం చేసే వారికి మంచి విజయం లభిస్తుంది. మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి(Taurus)

ఈ రాశి వారికి మే నెలలో శుభప్రదంగా ఉంటుంది. మే నెలలో గురుడి ప్రవేశంతో అనేక రాజయోగాలు ఏర్పడతాయి. అందులోనూ వృషభరాశిలోనే గజలక్ష్మీ, గజకేసరి, శుక్రాదిత్య యోగం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు చేసే పనులన్నింట్లో విజయం సాధిస్తారు. మీరు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలొస్తాయి. మీ కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల మీ మనసులో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చేసే అన్వేషణ పూర్తవుతుంది. మీ కెరీర్ పరంగా మంచి విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి(Leo)

ఈ రాశి వారికి మే నెలలో ఏర్పడే శుభ యోగాల కారణంగా అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. ఈ రాశి నుంచి గురుడు పదో స్థానం నుంచి రవాణా చేయడం వల్ల సింహ రాశి వారికి మంచి ప్రయోజనాలు రానున్నాయి. మీరు ఎక్కడి నుంచైనా అదనపు ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. మీ వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. మంచి ప్రణాళికతో కొనసాగుతున్న పనులు ముందుకు సాగొచ్చు. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

మకర రాశి(Capricorn)

ఈ రాశి వారికి శుక్రుడు, గురుడు, సూర్య గ్రహాల వల్ల మంచి ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఈ నెలలో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. మీరు అదనపు ఆదాయం సంపాదించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

కుంభ రాశి(Aquarius)

ఈ రాశి వారు మే నెలలో కొన్ని శుభవార్తలు వింటారు. గ్రహాల సంచారం కారణంగా అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. గ్రహాల కలయికతో కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. మీరు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందొచ్చు. మీ పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మే నెలలో మీరు చాలా సంతోషంగా, ప్రశాంతంగా గడుపుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.

Also Read : 127 సంవత్సరాల చరిత్రకు బీటలు..వేరుపడిన గోద్రెజ్ కుటుంబం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు