Mathu Vadalara 2 Trailer: 'మత్తు వదలరా 2' ట్రైలర్ లాంచ్.. ప్రభాస్ టైమింగ్ అదుర్స్..!

శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మత్తు వదలరా 2'. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఫన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

New Update
Mathu Vadalara 2 Trailer: 'మత్తు వదలరా 2' ట్రైలర్ లాంచ్.. ప్రభాస్ టైమింగ్ అదుర్స్..!

Mathu Vadalara 2 Trailer: శ్రీసింహా , ఫరియా అబుద్దుల్లా, కమెడియన్ సత్య, సునీల్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మత్తు వదలరా 2'. 2019 లో విడుదలైన సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలర' సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రానికి రితేష్ రైనా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. సెప్టెంబర్ 16 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

'మత్తు వదలరా 2' ట్రైలర్

ఇందులో భాగంగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ తో వినూత్నంగా ట్రైలర్ లాంచ్ చేయించారు. ప్రభాస్ తో కామెడీ చేస్తూ ఆసక్తికరంగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. శ్రీసింహా, కమెడియన్ సత్య కామెడీ ట్రాక్, వారి మధ్య ఉండే సన్నివేశాలు నవ్వులు పూయించాయి. మరో వైపు ట్రైలర్ లో వారిద్దరి దొంగతనాలు, క్రైమ్ సన్నివేశాలకు సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా కనిపించాయి. మొత్తానికి ఫన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Also Read: Shraddha Kapoor: అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్ క్షమాపణలు.! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు