Rajouri Fire: LOC సమీపంలో భారీ అగ్నిప్రమాదం, మందుపాతరలో పేలుళ్లు..!!

పూంచ్ జిల్లాలోని బాల్నోయ్, కృష్ణా ఘాటి సెక్టార్లలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టేందుకు వేసిన మందుపాతరలపైకి మంటలు చెలరేగాయి. మంటల కారణంగా నిరంతరం పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.

New Update
Rajouri Fire: LOC సమీపంలో భారీ అగ్నిప్రమాదం, మందుపాతరలో పేలుళ్లు..!!

Rajouri Fire: పూంచ్ జిల్లాలోని బాల్నోయ్, కృష్ణా ఘాటి సెక్టార్లలో నియంత్రణ రేఖకు సమీపంలోని శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వేసిన మందుపాతరల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి.ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేవు. ఆర్మీ సిబ్బంది, అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.సమాచారం ప్రకారం, పూంచ్ జిల్లాలోని బాల్నోయి, కృష్ణ ఘాటి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు భారీ రూపం దాల్చి వేగంగా వ్యాపించాయి.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ మైనార్టీలపై పగ పట్టింది: కేటీఆర్

ఈ అగ్నిప్రమాదం కారణంగా సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు అమర్చిన మందుపాతరలు కూడా పేలడం ప్రారంభించాయి. అదే సమయంలో ఆర్మీ జవాన్లు, ఆర్మీ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే పనిని ప్రారంభించారు.రెస్య్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HCU Land Issue: HCU విద్యార్థులపై లాఠీ ఛార్జ్.. వీడియో వైరల్

HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

New Update
HCU students lathi charged by Police

HCU students lathi charged by Police

తెలంగాణలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. HCUకి సంబంధించిన 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని, జంతువులను, అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఈ మేరకు హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. వందల మంది విద్యార్థులు హెచ్‌సీయూ గేట్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. 

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

విద్యార్థులపై లాఠీ ఛార్జ్

దీంతో HCU లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు తాజాగా కొరడా ఝులిపించారు. HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ లాఠీ ఛార్జ్ అనంతరం రేవంత్‌ సర్కారుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

మరోవైపు HCU లో విద్యార్థులకు ఉపాధ్యాయులు, యూనివర్సిటీ సిబ్బంది మద్దతుగా నిరసన తెలిపేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. 

Also Read: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

అలాగే చిన్నపిల్లలు సైతం HCUకి మద్దతుగా నిలుస్తున్నారు. HCU అడవుల్లో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని, ఆ అడవులను వైల్డ్ లైఫ్ సాంక్చురీగా ప్రకటించి జంతువులను, పక్షులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి 6వ తరగతి విద్యార్థి విజ్ఞప్తి చేసిన వీడియో వైరల్ అవుతుంది. 

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

(hcu campus land issue | hcu campus lands | revanth-reddy | latest-telugu-news | telugu-news | telangana-news)

Advertisment
Advertisment
Advertisment