loksabha: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారు.. ఉద్యోగులకు సెలవులు రద్దు!

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 13న లేదంటే 14న ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉండగా.. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగబోతున్నట్లు చర్చ నడుస్తోంది. తెలంగాణలో మార్చి 8, 9, 10 తేదీల్లో ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు సమాచారం.

New Update
loksabha: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారు.. ఉద్యోగులకు సెలవులు రద్దు!

Parliament: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంకేతాలు కూడా వచ్చాయని, దీంతో పెండింగ్ పనులు, శంకుస్థాపనలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వ అధికారులను కలెక్టర్లు ఆదేశించినట్లు సమాచారం. అయితే ఎన్నికల షెడ్యూల్ తర్వాత కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉండకపోవడంతో నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సభలతో సీఎం రేవంత్ రెడ్డి బిజి బిజీగా గడుపుతున్నారు.

ఏప్రిల్‌ 11న పోలింగ్‌..
ఈ మేరకు ఈ నెల 13న లేదంటే 14న ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉండగా.. 2024లో ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగబోతున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్లు ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బందికి సెలవులను రద్దు చేసిన కలెక్టర్లు.. 8, 9, 10 తేదీల్లో సెలవు పెట్టడానికి వీల్లేదంటూ ఆదేశాలు సైతం జారీ చేశారట. ఇక ఈ ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. రేవంత్ రెడ్డి సర్కారుతో పాటు రాష్ట్రంలోని పార్టీలు విస్తృత కార్యాచరణ మొదలుపెట్టగా.. ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కేడర్‌తో పరుగులు పెట్టిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Sudha Murty : రాజ్యసభకు సుధా మూర్తి.. మోదీ ఏం అన్నారంటే?

దేశమంతటా కోడ్ అమల్లోకి..
అలాగే ఈ షెడ్యూల్‌ జారీతో దేశమంతటా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుండగా.. కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోనున్నాయి. దీంతో చిన్న చిన్న ప్రారంభోత్సవాల రహస్యంగా పూర్తి చేస్తున్నారు నాయకులు. జిల్లాల స్థాయిలో పూర్తిచేయాల్సిన పనులపై కూడా దృష్టిపెట్టిన అధికారులు ఈనెల 12 కల్లా పెండిగ్ పనులన్నీ పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hrithik Roshan Krrish 4: ఇదో కొత్త ప్రపంచం, మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది: హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ తన డైరెక్షన్ డెబ్యూట్‌గా 'క్రిష్ 4'ను తెరకెక్కించబోతున్నారు. దర్శకుడిగా మారడం తనకు కొత్తగా, సవాళ్లతో కూడినదిగా అనిపిస్తుందని చెప్పారు. హృతిక్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో అనేక మంది బాలీవుడ్ స్టార్‌లు ఉన్నారు.

New Update
Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఇప్పటివరకు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆయన ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌కి రెడీ అవుతున్నారు. అవును, హృతిక్ రోషన్ తొలిసారి దర్శకుడిగా మారనున్నట్టు ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కబోయే తొలి చిత్రం ‘క్రిష్ 4’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో హృతిక్ ఈ ప్రయాణంపై తన భావాలను షేర్ చేసుకున్నారు. “దర్శకుడిగా మారడం నాకు సంతోషకరం అయినప్పటికీ, కొంత భయం కూడా కలుగుతోంది. ఇది పూర్తిగా కొత్త ప్రపంచం. మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది. ఒక దర్శకుడిగా అనేక విషయాల్లో నైపుణ్యం అవసరం, భారీగా పరిశోధనలు చేయాలి. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో, 'ఇది ఎందుకు ఎంచుకున్నానా?' అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయినా, వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను,” అంటూ తన డైరెక్షన్ జర్నీపై హృతిక్ ఓపెన్ అయ్యారు.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

హృతిక్‌ త్రిపాత్రాభినయంలో..!

‘క్రిష్ 4’ అనగానే ఫ్యాన్స్‌లో ఎనలేని క్రేజ్ మొదలైంది. అందుకు కారణం, హృతిక్‌ ఇందులో త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారని వినిపిస్తున్న వార్తలు. హీరోగా మాత్రమే కాకుండా, విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ టాప్ నటీనటులు కూడా భాగం కానున్నారు. ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖ లాంటి ప్రముఖులు ఇందులో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే గ్లామర్ క్వీన్ నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఈ విధంగా క్రిష్ 4 సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా హృతిక్ కొత్త ఛాప్టర్ మొదలుపెట్టబోతున్నారు. ఆయన తీసుకున్న ఈ క్రియేటివ్ రిస్క్ బాలీవుడ్‌లో మరో సెన్సేషన్‌ను సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment