/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/manipur-jpg.webp)
Manipur : మణిపూర్(Manipur) లో తాజాగా హింస(Violence) చెలరేగింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు పౌరులను(Civilians) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకి తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్తౌఖోంగ్ ఖా ఖునౌలో నలుగురు పౌరులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
అలాగే కాంగ్పోక్పి జిల్లా కాంగ్చుప్ చింగ్ఖాంగ్ లో మరో వ్యక్తిని సాయుధ దుండగులు కాల్చి చంపారు. బిష్ణూపూర్(Bishnupur) జిల్లాల్లో నలుగురు వ్యక్తులను కాల్చి చంపిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు వివరించారు. మృతి చెందిన వారిని అంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి..
మృతుల్లో బమోంజావో సింగ్ అనే 61 సంవత్సరాల వ్యక్తి ఉండగా అతని కుమారుడు మణితోంబ సింగ్ (32) కూడా ఉన్నాడు. వీరితో పాటు తియం సోమేంద్ర సింగ్ (55) , నింగ్థౌజం నబద్విప్ సింగ్(40) అనే వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి కాల్చి చంపారు.
కాంగ్పోక్పిలో మరణించిన పౌరుడిని థియం కొంజిన్కు చెందిన తఖెల్లంబమ్ మనోరంజన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కంగ్చుప్ చింగ్ఖాంగ్ సమీపంలోని బంకర్ హిల్స్ నుండి మనోరంజన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.బుధ, గురువారాల మధ్య రాత్రి సాయుధ దుండగుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బుధవారం రాత్రి, తౌబల్ జిల్లాలోని ఖంగాబోక్ వద్ద ఒక గుంపు వారిపై కాల్పులు జరపడంతో ముగ్గురు సరిహద్దు భద్రతా దళం సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.
Also read: అయోధ్య రామమందిరం గర్భగుడి లోపల రామ్ లల్లా విగ్రహం మొదటి చిత్రం !