అమితా బచ్చన్ తో మమతా బెనర్జీ భేటీ... బిగ్ బీకి రాఖీ కట్టిన దీదీ....!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిగ్ బీ అమితాబచ్చన్ ను కలిశారు. ముంబైలోని ఆయన నివాసంలో అమితాబ్ తో దీదీ భేటీ అయ్యారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ముచ్చటించారు. అనంతరం బిగ్ బీకి మమతా బెనర్జీ రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను అమితాబచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

author-image
By G Ramu
New Update
అమితా బచ్చన్ తో మమతా బెనర్జీ భేటీ... బిగ్ బీకి రాఖీ కట్టిన దీదీ....!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిగ్ బీ అమితాబచ్చన్ ను కలిశారు. ముంబైలోని ఆయన నివాసంలో అమితాబ్ తో దీదీ భేటీ అయ్యారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ముచ్చటించారు. అనంతరం బిగ్ బీకి మమతా బెనర్జీ రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను అమితాబచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

also read:ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి షాక్…. మాజీ ప్రధాని కస్టడీని పొడిగించిన కోర్టు….!

విపక్ష కూటమి ‘ఇండియా’ మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహిస్తున్నారు. అగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మమతా బెనర్జీ ముంబైకి చేరుకున్నారు. ముంబైకి చేరుకున్న కొద్ది సేపటికే ఆమె బిగ్ బీ ఇంటికి వెళ్లారు. ఆమెకు బచ్చన్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

గతేడాది కోల్ కతాలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమితాబచ్చన్ పాల్గొన్నారు. ఆ సమావేశానికి సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సినిమా రంగానికి అమితాబచ్చన్ చేసిన సేవలను గుర్తించి ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఇవ్వాలని కేంద్రాన్ని ఆమె డిమాండ్ చేశారు.

also read:బిల్కీస్ భానో… మహిళా రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలి…!

అమితా బచ్చన్ కుటుంబ సభ్యులతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అమితాబ్ జీ మన భారత రత్న అని ఆమె అన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సినిమా రంగానికి ఎనలేని సేవలు చేశారని ఆమె కొనియాడారు. అమితాబ్ కు తాను రాఖీ కట్టానన్నారు. కోల్ కతాకు రావాలని ఆయన్ని ఆహ్వానించినట్టు మమతా బెనర్జీ వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట.

New Update
kerala emp

kerala emp

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా...అతడిని మరో వ్యక్తి మోకాళ్ల పై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ...నిర్దేశించిన టార్గెట్‌ ను పూర్తి చేయని ఉద్యోగుల పై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

Also Read: Local Body Elections : ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు

పోలీసుల సమాచారం ప్రకారం..కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్‌ సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలిసిందన్నారు.ఘటన మాత్రం పెరుంబవూర్‌ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే యజమాని మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది.దీని పై ఉద్యోగులు ఇప్పటి వరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం.

ఈ అమానవీయ ఘటన పై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలు షాక్‌ కు గురి చేశాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్‌ కుట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన వెల్లడించారు. ఈ ఘటన పైపూర్తి స్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

Also Read: TDP vs Jana Sena : పిఠాపురంలో రచ్చరచ్చ..రెండోరోజు నాగబాబుకు తప్పని నిరసన సెగ

Also Read: Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు

 kerala | employees | tortured | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment