Maldives: మళ్లీ మాల్దీవులతో దోస్తానా? విదేశాంగ మంత్రితో మాల్దీవుల ప్రెసిడెంట్ భేటీ!

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న తర్వాత ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలు క్షీణించిన క్రమంలో జరిగిన ఈ భేటీ రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. 

New Update
Maldives: మళ్లీ మాల్దీవులతో దోస్తానా? విదేశాంగ మంత్రితో మాల్దీవుల ప్రెసిడెంట్ భేటీ!

Maldives:  ప్రధాని మోదీ మూడో ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు కూడా భారత్‌కు వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు సోమవారం, ముయిజ్జు ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ భేటీ జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే జరిగిన ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను పునఃప్రారంభించడంలో సహాయకరంగా ఉంటుందని భావిస్తున్నారు. 

Maldives:  న్యూ ఢిల్లీలో మహమ్మద్ ముయిజ్జూను కలిసిన తర్వాత, జైశంకర్ సోషల్ మీడియాX లో  “ఈరోజు న్యూఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జూని కలవడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశం .. మాల్దీవులతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను.” అంటూ పోస్ట్ చేశారు. 

ముయిజు భారతదేశానికి వ్యతిరేకం..
Maldives:  మాల్దీవుల కొత్త ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజు భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ముయిజో తన ఎన్నికల ప్రచార సమయం నుండి భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు. ఎన్నికల ప్రచారంలో 'ఇండియా అవుట్' అనే నినాదాన్ని ఇచ్చిన ముయిజు గెలిచిన తర్వాత మాల్దీవుల గడ్డపై భారత సైనికుల ఉనికిని పూర్తిగా తొలగించారు. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మాల్దీవులు .. దాని సముద్ర సరిహద్దులలో చైనా జోక్యం వేగంగా పెరిగింది, ఇది భారతదేశానికి ప్రమాద సంకేతంగా చెప్పవచ్చు. 

భారత్ కు మాల్దీవులు ఎందుకు ముఖ్యమైనది?
Maldives:  మాల్దీవులు .. భారతదేశం మధ్య సంబంధాలు ఎప్పుడూ చాలా బాగుండేవి. కానీ ఇటీవల సంరెండు దేశాల మధ్య  దూరం ఏర్పడింది. మాల్దీవులు సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న దేశం.  అయితే ఇది భారతదేశ సముద్ర సరిహద్దుల భద్రతకు వ్యూహాత్మకమైనది.. ముఖ్యమైనది కూడా. భారతదేశం నుండి మాల్దీవుల సంబంధాలు దూరం కావడం వల్ల హిందూ మహాసముద్రంలో భారత సైన్యం పట్టు బలహీనపడవచ్చు. ఇది కాకుండా, భారతీయ పర్యాటకుల మొదటి ఎంపిక మాల్దీవులు. ఈ భేటీ తర్వాత భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం మిస్సింగ్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

ప్రపంచానికి మరో మహమ్మారి తప్పదని అంటున్నారు డబ్లూహెచ్ వో చీఫ్ టెడ్రోస్. ఇది సైంటిఫిక్ ముప్పు కాదని..అంటువ్యాధులు మళ్ళీ ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. 

New Update
who

WHO Chief Tedros

ప్రపంచాన్ని మరో మహమ్మారి కబళించే అవకాశం ఉందని...అందరూ దానికి సంసిద్ధంగా ఉండాలని అంటున్నారు డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయేసస్‌. అయితే ఈసారి సైన్స్ ప్రయోగాల వల్లనో ఇంక దేని వల్లనే ఈ ముప్పు రాదని..అంటు వ్యాధులే విజృంభిస్తాయని ఆయన చెబుతున్నారు. ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేనప్పటికీ దానికి రెడీగా ఉండాలని ప్రపంచానికి టెడ్రోస్ పిలుపునిచ్చారు. డబ్ల్యూహెచ్‌వో పాండమిక్‌ అగ్రిమెంట్‌పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన టెడ్రోస్ కోవిడ్ మహమ్మారిని గుర్తు చేశారు. అప్పుడే పై వ్యాఖ్యలను కూడా చేశారు. ఇప్పుడు మరో మహమ్మారి 20 ేళ్ళ లోపు లేదా అంత కంటే ముందే...ఇంకా చెప్పాలంటే రేపు కూడా మొదలవ్వొచ్చని అన్నారు. ఏది ఏమైనా కచ్చితంగా వచ్చే తీరుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు టెడ్రోస్. 

నిజానికి 2 కోట్ల మంది..

డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ టెడ్రోస్ కోవిడ్ మహమ్మారి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారని ఉంది..కానీ నిజానికి ఆ సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని డబ్ల్యూహెచ్ వో అంచనా అని ఆయన చెప్పారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి 10 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించిందని టెడ్రోస్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన విధ్వంసం మీదనా, రాబోయే మహమ్మారి మీదన కూడా  ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

 today-latest-news-in-telugu | who | covid

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

Advertisment
Advertisment
Advertisment