Loksabha Elections 2024: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫుల్ రిచ్.. ఆయన ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ తనకు రూ.5,785 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి బరిలో నిలిచి అభ్యర్థుల్లో టాప్ ఆస్తులు ఉన్న వ్యక్తిగా నిలిచారు.

New Update
Loksabha Elections 2024: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫుల్ రిచ్.. ఆయన ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఈ క్రమంలోనే గుంటూరు నుంచి లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ నామినేషన్ వేశారు. ఆయన తనకు రూ.5,785 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఆస్తులపై తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో బరిలో ఉన్న ధనిక ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గా భావిస్తున్నారు. ఈ మేరకు పెమ్మసానికి రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులుండగా.. భార్య శ్రీరత్న పేరిట రూ.2,280 కోట్ల చరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ చెరో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. చెరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయి.

రూ.6.11 కోట్ల విలువైన కార్లు
పెమ్మసానికి రూ.6.11 కోట్ల విలువైన 4 కార్లు, బ్యాంకు ఖాతాలో చెరో రూ.5.9 కోట్లు ఉన్నాయి. మొత్తం 6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగుభూమి, హైదరాబాద్‌లో రూ.28.1 కోట్ల భూమి, రూ.29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, దిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.6.82 కోట్ల భూమి ఉన్నాయి. శ్రీరత్న పేరిట కృష్ణాజిల్లాలో రూ.2.33 కోట్ల విలువ చేసే సాగుభూమి. దిల్లీలో రూ.34.82 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.28.26 కోట్ల నివాస భవనాలు ఉన్నాయి.

ఎంబీబీఎస్:
పెమ్మసాని చంద్రశేఖర్ ఇండియాలోనే ఎంబీబీఎస్ చదివారు. అనంతరం పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. మాస్టర్స్ పూర్తి చేసి జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. అలాగే మెడికల్ ఫీల్డ్‌లో స్థిరపడిపోయారు. పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. యూవరల్డ్ పేరుతో అమెరికాలో ఆన్ లైన్ ఎడ్యూటెక్ కంపెనీని పెమ్మసాని చంద్రశేఖర్ నడుపుతున్నారు. అయితే సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచారు పెమ్మసాని చంద్రశేఖర్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలి

బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుద్వేల్‌ కు చెందిన బీటెక్ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి బలయ్యాడు.

New Update
Cricket Betting

Cricket Betting

Cricket Betting : బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే బుద్వేల్‌లో చోటు చేసుకుంది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ సీజన్ అంటేనే బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటారు. ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే బెట్టింగ్ దందాలో కోట్లు చేతులు మారతాయి. ఈ బెట్టింగుల ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు డబ్బు పోగోట్టుకొని మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

పవన్ కడా ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్‌ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పరిస్థితిని తట్టుకోలేక ఇంటి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment