Lokesh Yuvagalam: రేపటి నుంచి మళ్లీ లోకేశ్ యువగళం పాదయాత్ర... అరెస్ట్ చేస్తే రంగంలోకి బ్రాహ్మణి?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8.25గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో పాదయాత్ర మరోవారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. వచ్చేనెల 3వ తేదీ నుంచి యువగళం పాదయాత్ర చేట్టాలని కోరారని తెలుస్తోంది. ఒకవేళ లోకేశ్ ను అరెస్టు చేస్తే...బ్రాహ్మణి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పాదయాత్ర గురించి బ్రాహ్మణికి కుటుంబ సభ్యులు అన్ని విషయాలను వివరించారట.

New Update
Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

Lokesh Yuvagalam from Tomorrow: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీ(TDP)లో ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8.25గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో పాదయాత్ర మరోవారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. వచ్చేనెల 3వ తేదీ నుంచి యువగళం పాదయాత్ర చేట్టాలని కోరారని తెలుస్తోంది. ఒకవేళ లోకేశ్ ను అరెస్టు చేస్తే...బ్రాహ్మణి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పాదయాత్ర గురించి బ్రాహ్మణికి (Nara Brahmani) కుటుంబ సభ్యులు అన్ని విషయాలను వివరించారట.

ఇది కూడా చదవండి: గుండెపోటుతో క్లాస్‎రూమ్‎లోనే 8వ తరగతి విద్యార్థిని మృతి..!!

కాగా శుక్రవారం నంద్యాలలో పార్టీ పీఎసీ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కమిటీ సమావేశంలో ఢిల్లీ నుంచి సామాజిక మాధ్యమం ద్వారా లోకేశ్ పాల్గొంటారని సమాచారం. చంద్రబాబును అరెస్టు చేసిన ప్రాంతంలోనే సమావేశం నిర్వహించాలని నిర్ణయించారట. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రేపటి సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఈలోగా లోకేశ్ అరెస్టు చేసినట్లయితే...నారా బ్రాహ్మణి పాదయాత్ర చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే కుటుంబ సభ్యులు బ్రాహ్మణికి అన్ని విషయాల గురించి వివరించారట. బ్రాహ్మాణి నారా, నందమూరి కుటుంబాలకు చెందినది కావడంతో...ఆమె పాదయాత్ర చేపడితే ప్రజల నుంచి సానుభూతి ఎక్కువగా వస్తుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. అయితే లోకేశ్ యువగళం పాదయాత్ర రేపటి నుంచి కాకుండా మరో వారం రోజులపాటు వాయిదా వేయాలని టీడీపీలోని ఓ వర్గం నేతలు చెప్పారట.

అక్టోబర్ 3వ తేదీ వరకు ఎదురు చూసి ఆ తర్వాత పాదయాత్ర చేపట్టాలని సూచించారని సమాచారం. అయితే బ్రాహ్మణి పాదయాత్రపై అధికారపార్టీలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest)తో టీడీపీకి సానుభూతి పెరుగుతుందని అధికార పార్టీలో ఆందోళన మొదలైందట. ఒకవేళ లోకేశ్ ను అరెస్టు చేస్తే...వారు అనుకున్నట్లు బ్రాహ్మాణి పాదయాత్ర చేపడితే...ప్రజల నుంచి మరింత సానుభూతి పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఈ పాదయాత్రపై రేపు క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం మానుకోండి…లేదంటే ఈ వ్యాధులు తప్పవు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap News: ఏపీలో 2 నెలల పాటూ చేపల వేటపై నిషేధం..

ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది 61 రోజుల పాటు కొనసాగుతుంది. మత్స్య సంపదను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకూడదు.

New Update
fishing

fishing

ఏపీలో గత అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు అంటే సుమారు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటూ చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి వాటి సంతాన్నాన్ని అభివృద్ది చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు.. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారు.

Also Read:ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!

ఈ రెండు నెలల పాటూ అధికారులు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. మత్స్యకారులు నిబంధనలు తప్పితే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు కూడా దూరం అవుతారు. కాబట్టి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్నందుకు ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. 

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

గతంలో చేపల వేట నిషేధం 40 రోజులు ఉంటే.. దానిని 60 రోజులకు పెంచారు. గతంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు బియ్యం ఉచితంగా అందించేవారు. ఆ తర్వాత ఆ స్థానంలో మత్స్యకార భరోసా వచ్చింది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత బియ్యానికి బదులు రూ.2 వేల చొప్పున సాయం అందించింది.. దానిని రూ.4 వేలుకు పెంచారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసాను రూ.10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వస్తే చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపింది.

అందుకు తగిన విధంగా ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.. ఈ నెల కానీ, మే నెలల ో కానీ మత్స్యకారులకు భరోసా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సర్వే నిర్వహించి లబ్ధిదారుల్ని గుర్తిస్తామని చెబుతున్నారు అధికారులు.

Also  Read: America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!

Also Read: America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

fishing-boat | fishing | 2 months | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment