క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్స్ పై ట్యాక్స్ విధించే కీలక జీఎస్టీ బిల్లుకు ఆమోదం....!

లోక్ సభ శుక్రవారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు ఉద్దేశించిన కేంద్ర, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలకు సవరణల బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ పై సభలో రచ్చ జరుగుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు.

author-image
By G Ramu
New Update
BIG BREAKING: భారీగా పెరగనున్న ధరలు

లోక్ సభ శుక్రవారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు ఉద్దేశించిన కేంద్ర, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలకు సవరణల బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ పై సభలో రచ్చ జరుగుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు.

సభలో గందరగోళం మధ్య సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్( సవరణ) బిల్లు - 2023, ఇంటి గ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సవరణ) బి్ల్లు -2023 లను సభలో ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. రాష్ట్ర జీఎస్టీ చట్టాల్లో చేసిన సవరణలను రాష్ట్రాలు ఆయా అసెంబ్లీల్లో చర్చించి ఆమోదం తెలుపనున్నాయి.

ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాల సరఫరాపై పన్ను విధించడంపై స్పష్టత ఇచ్చేందుకు సీజీఎస్టీ చట్టం- 2017లోని షెడ్యూల్-3లో కొత్త నిబంధనను పొందు పరిచేందుకు ఈ సవరణ బిల్లును తీసుకు వచ్చారు. ఇక ఆన్ లైన్ గేమింగ్ సంస్థలపై జీఎస్టీ విధించేందుకు కొత్త నిబంధనను చేర్చేందుకు గాను ఐజీఎస్టీలో సవరణలను కేంద్రం తీసుకు వచ్చింది.

రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాలలో ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను నిరోధించేందుకు కూడా ఈ సవరణల ద్వారా ప్రభుత్వానికి అధికారాన్ని అందజేశారు. ఇక కేంద్ర జీఎస్టీ(CGST), ఇంటిగ్రేటెడ్(IGST) చట్టాలకు సవరణలను గతవారం జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు.

New Update
P. chidambaram

P. chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

హాస్పిటల్‌లో చేర్పించి అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి. 

Advertisment
Advertisment
Advertisment