MLA Harish Rao: అలా చేస్తే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు హరీష్ రావు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్‌కు ఓటెయ్యండని... రుణమాఫీ కాకపోతే కారుకు ఓటు వెయ్యాలి అని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని ఆరోపించారు.

New Update
Harish Rao: పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు.. హరీష్ రావు ఫైర్

MLA Harish Rao:మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పై విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలో ఒకటే అని అన్నారు.

రఘునందన్ పనికి వస్తాడా?..

గజ్వేల్.. మూడు సార్లు ఈ గడ్డ నుండి కేసీఆర్ గారిని గెలిపించిన ఈ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని అన్నారు హరీష్ రావు. సమస్యలపైన, పరిపాలన మీద పట్టు ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి గారిని గెలిపించాలని కోరారు. దుబ్బాకలో పనికి రాని రఘునందన్ ఇప్పుడు మెదక్ పార్లమెంట్‌కు పనికి వస్తాడా? అని ప్రశ్నించారు. 100 కోట్ల రూపాయలతో ట్రస్టు ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన మంచి మనసున్న మనిషి మన వెంకట్రామిరెడ్డి అని పేర్కొన్నారు.

హరీష్ రావు కామెంట్స్...

* గజ్వేల్ గడ్డ మీద ఈర్ష్య పెట్టుకున్న ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు ఎందుకు వేయాలి?!
* గజ్వేల్ నియోజకవర్గ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉందా?
* రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు.
* 100 రోజుల కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ పాలనలో ఉద్దరించుడు మాట దేవుడెరుగు కానీ, అన్నీ ఉద్దెర మాటలే చెప్తున్నారు.
* 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి. కాకపోతే కారుకు ఎయ్యుర్రి.
* యాసంగి వడ్లకు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతదని మనం ప్రతీ ఊర్ల పంచాయితీ పెట్టాలి.
* మన అక్కలకు, చెల్లెలకు ప్రతి నెల రూ. 2,500లు డిసెంబర్ నెల నుండి ఇస్తా అన్న మొట్ట మొదటి హామీని అమలు చేయకుండా మహా మోసం చేసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ.
* రూ. 200 ఉన్న పెన్షన్‌ను 2000 చేసిన ఘనత మన కేసీఆర్‌ది అయితే, రూ. 4000 ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఇంత వరకూ పెన్షన్ ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
* తులం బంగారం, నిరుద్యోగ భృతి ఇస్తామని కల్లబొల్లి మాయ మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ.
* పేగులు మెడలో వేసుకోవడం కాదు రేవంత్ రెడ్డి.. పేదలకు హామీ ఇవ్వు. మానవ బాంబు అవడం కాదు మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటో డ్రైవర్ సోదరులను ఓదార్చు.
* పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరువు. మల్లన్న సాగర్ గేట్లు తెరిచి మా కూడవెల్లి వాగుకు నీళ్ళు ఇస్తే మా గజ్వేల్, దుబ్బాక రైతులు పంటలు పండించుకుంటరు.
* మన ప్రభుత్వంలో 15 రోజులకు ఒకసారి కో-ఆపరేటివ్ డైరీ ఫామ్ రైతులకు బిల్లులు వస్తుండే. కానీ, నేడు 3 నెలలు దాటిపోయినా బిల్లులు లేవు.
* కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, భవిష్యత్ మనదే. మీరే మాకు దేవుళ్లు. మీ కాళ్లు కడిగి నీళ్లు చల్లుకున్నా తక్కువే.
* పదేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యం.
* బీజేపీ చెప్పింది వింటే జోడీ.. లేకపోతే ఈడీ.
* 2 కోట్ల ఉద్యోగాల హామీ పేరుతో దేశంలోని నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ.
* పదేళ్లలో పెట్రోల్, డీజిల్, సిలిండర్ రెండింతలు చేసి ఎన్నికల ముందు రెండు రూపాయలు తగ్గించింది.
* కానీ, ఈ పదేళ్లు తెలంగాణ రైతుల కోసం అహర్నిశలు పాటుపడి కాళేశ్వరం కట్టి రైతులకు నీళ్లు అందించిన మహనీయుడు మన కేసీఆర్ గారు.
* ఈ 100 రోజుల పాలనను రేపు ఎన్నికల రెఫరెండంగా చూపించి మనల్ని మోసం చేసే అవకాశం ఉంది.
* కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోసపోతాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 4,000 పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారు అంటారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. దీనిపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలి.
* గజ్వేల్ అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలి. మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయిన వెంకట్రామిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి." అని వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు