UP: దేశవ్యాప్తంగా తగ్గిన మోడీ క్రేజ్‌.. యూపీలో భారీ దెబ్బ!

యూపీలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అఖిలేశ్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ పార్టీ 42కిపైగా స్థానాల్లో లీడింగ్‌తో దూసుకెళ్తోంది. వార‌ణాసిలో ప్రధాని మోడీ వెనుకంజ‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అజ‌య్ రాయ్ మోడీకంటే ముందంజలో ఉన్నారు.

New Update
UP: దేశవ్యాప్తంగా తగ్గిన మోడీ క్రేజ్‌.. యూపీలో భారీ దెబ్బ!

UP Election Results: ఈ ఎన్నికల్లో మోడీకి ఊహించని షాక్ తగిలింది. 400 పైగా సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేయాలనుకున్న ఎన్డీఏకు కనీసం 300 సీట్లు కూడా దాటే పరిస్థితి కనిపించట్లేదు. అయోధ్య రామ మంత్రంతో ప్రచారం నిర్వహించినప్పటకీ ఇది కూడా పెద్దగా ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా యూపీలో బీజేపీ సీట్లకు భారీగా గండి పడింది. ఉత్తర‌ప్రదేశ్ త‌మ‌దే అన్న ధీమాలో ఉన్న బీజేపీకి ఎస్పీ ఊహించ‌ని షాక్ ఇచ్చింది. అఖిలేశ్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్తోంది. 80 లోక్‌స‌భ స్థానాలు ఉన్న యూపీలో ప్రస్తుత స‌మాచారం ప్రకారం ఇండియా కూటమి సుమారు 42కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేపీ ప్రస్తుతం 37 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుంది.


తొలి రౌండ్‌లో వార‌ణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. అక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజ‌య్ రాయ్ ముందంలో ఉన్నారు. యూపీలో ఈసారి బీజేపీ 75 స్థానాల్లో పోటీ చేసింది. 5 సీట్లను కూట‌మి పార్టీల‌కు ఇచ్చింది. స‌మాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 17, తృణ‌మూల్ ఒక సీటులో పోటీ చేసింది. అటు మహారాష్ట్రలోనూ మోడీ వేవ్‌ పనిచేయలేదు. ఫలితంగా కేంద్రంలో స్వల్ప మెజార్టీతో NDA ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఇండియా కూటమి 233 సీట్లతో లీడ్ లో ఉండగా.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతు అయ్యాయి. మమత బెనర్జీ తన పట్టు నిలుపుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100  పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.

New Update
stock market

stock market

 స్టాక్ మార్కెట్లో ఇంతలా డైనమిక్ ఛేంజ్ లు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరేమో. నిన్న మార్కెట్లు అధ:పాతాళానికి వెళ్ళి కోట్ల రూపాయలు కరిగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాదిలో రెండవ అతిపెద్ద పతనాన్ని చూసింది. సెన్సెక్స్ 2226 పాయింట్లు (2.95%) పడిపోయి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (3.24%) పడిపోయి 22,161 వద్ద ముగిసింది. అంతకుముందు జూన్ 4వ తేదీ 2024లో మార్కెట్ 5.74% పడిపోయింది. మరోవైపు ప్రపంచ మార్కెట్ పరిస్థితి కూడా అలానే ఉంది. 

ఆసియా మార్కెట్లలో వృద్ధి..

కానీ ఈరోజు ఉదయానికి పరిస్థితి అంతా మారిపోయింది. నష్టాల్లో ఉన్న సూచీలు ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1100 (1.60%) పాయింట్లకు పైగా లాభంతో 74,300 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా దాదాపు 400 (1.70%) పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని అన్ని స్టాక్స్ అంటే  30 స్టాక్స్ లాభాల్లో పయనిస్తున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆటో షేర్లు బాగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో పెరుగుదల వల్లనే భారతీయ మార్కెట్ లాభాలు చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ దాదాపు 6% పెరిగింది. అలాగే హాంకాంగ్ ఇండెక్స్ కూడా 2% పెరిగింది. వీటితో పాటూ NSE అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ కూడా 1.5% పెరిగింది. ఇది మార్కెట్లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది.  అలాగే నిఫ్టీ 50, సెన్సెక్స్ చార్టులు ఓవర్‌సోల్డ్ RSI స్థాయిలను చూపుతున్నాయి. ఇది షార్ట్-కవరింగ్ , కొత్త కొనుగోళ్లకు దారితీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

today-latest-news-in-telugu | stock-markets | sensex | nifty | shares

Also Read: Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!

Also Read: Trump Tariffs: ట్రంప్ సుంకాల దెబ్బకు పడిపోయిన చమురు ధరలు..కంగారులో రష్యా

Advertisment
Advertisment
Advertisment