Gas Diseases: గ్యాస్‌ మాత్రలతో మరిన్ని రోగాలు ఖాయమా?

అసిడిటీ సమస్య నుంచి బయటపడేందుకు టాబ్లెట్స్‌ తీసుకుంటారు. దీనివల్ల రిలాక్స్‌గా అనిపించినా.. శరీరానికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందట. యాసిడ్ రిఫ్లక్స్ మాత్రలు వల్ల తీవ్రమైన ఆరోగ్య నష్టంతోపాటు డిమెన్షియా, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

New Update
gas diseases

Gas Diseases

Gas Diseases: ప్రస్తుతం అసిడిటీ అనేది చాలా సాధారణ సమస్య. చాలా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఛాతీ, కడుపులో మంట వస్తుంది. దీనినే అసిడిటీ అంటారు. ఈ స్థితిలో కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి వెళ్లి చికాకు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా ఈ సమస్య అసిడిటీ మందులతో తగ్గుతుంది. ప్రతి ఒక్కరికి ఉదయం నిద్ర లేవగానే అసిడిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట భోజనం చేసే సమయానికి పెరిగిపోతుంది. అందుకే కడుపుని ఖాళీగా ఉంచకూడదు. అల్పాహారం, భోజనం మధ్య చాలా సమయం గ్యాప్ ఉంది. ఆ టైమ్ గ్యాప్‌లో ఏదోకటి తినాలి.

శరీరానికి అనేక దుష్ప్రభావాలు:

  • ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది రోజూ టాబ్లెట్స్‌ తీసుకుంటారు. దీనివల్ల ఆ క్షణం మనకు రిలాక్స్‌గా అనిపిస్తుంది, కానీ ఇది మన శరీరానికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వైద్యుల నివేదికల ప్రకారం యాసిడ్ రిఫ్లక్స్ మాత్రలు పదేపదే తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య నష్టం జరుగుతుంది. గ్యాస్‌ టాబ్లెట్స్‌ వేసుకోవడం వల్ల డిమెన్షియా, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: పాలు లేకుండానే వెన్న తయారు చేస్తున్న కంపెనీ

  • యాసిడ్ రిఫ్లక్స్ చికిత్సకు ఉపయోగించే మందులు దీర్ఘకాలికంగా తీసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మందులు శరీరంలో కాల్షియం శోషణను ప్రభావితం చేస్తాయి. ఇది ఎముకలు బలహీనపడటానికి దారితీస్తుంది. మీరు ఇప్పటికే మెదడు లేదా ఎముక సమస్యలతో పోరాడుతున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. యాసిడ్ రిఫ్లక్స్ కోసం ఉపయోగించే మందులను ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. అందుకే వీటిని ఎక్కువ కాలం వాడకూడదని చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి:  చూసేందుకు చిన్న చేప..సౌండ్‌ మాత్రం సాలిడ్‌గా ఉంటుంది

 

 

ఇది కూడా చదవండి:  భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SriRama Navami : శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీ కష్టాలు పరార్!

శ్రీరామ నవమి రోజున కొన్ని నియమాలు పాటించి పూజలు చేస్తే దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు అంటున్నారు. నవమి రోజు అన్న, వస్త్ర దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు.

author-image
By Kusuma
New Update
Srirama navami

Srirama navami Photograph: (Srirama navami)

ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలోని నవమి రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఈ పండుగను జరుపుకోనున్నారు. అయితే నవమి రోజు వేకువ జామునే నిద్ర లేచి తలస్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేయాలి. దానిపై ఓ పీటను అమర్చి.. పట్టు వస్త్రం లేదా కొత్త దుస్తులు సమర్పించాలి.

ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం

అమ్మవారికి పూలదండలు..

ఆ తర్వాత సీతారాముల చిత్రపటానికి పువ్వులు, బొట్టు పెట్టి.. పంచామృతాలతో అభిషేకం చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి.. రామయ్య తండ్రికి.. అమ్మవారికి పూల దండలు సమర్పించాలి.  చివరలో స్వామి పాదాల దగ్గర అక్షింతలు వేస్తూ హారతి చదవాలి. దీని తర్వాత రామచరిత మానస్, సుందరకాండ వంటివి పారాయణం చేయాలి. పూజ అంతా అయిన తర్వాత కూడా నైవేద్యంగా వడపప్పు, పానకం వంటివి సమర్పించాలని అంటున్నారు.

ఇది కూడా చూడండి:  UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

దీన్ని తర్వాత ఇతరులకు సమర్పించాలి. అలాగే వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేస్తేనే దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయని పండితులు అంటున్నారు. అలాగే మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఈ విషయాలపై సందేహాలు ఏవైనా ఉంటే మీ సమీపంలోని పండితులను సంప్రదించగలరు. 

Advertisment
Advertisment
Advertisment