Crime: బిడ్డ లింగం తెలుసుకునేందుకు భార్య పొట్ట కోసిన దుర్మార్గుడు!

భార్య కడుపులో పెరుగుతున్నది ఆడ, మగ తెలుసుకునేందుకు పొట్టను కోసి చూసిన భర్త పన్నా లాల్‌కు యూపీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2020లో ఈ దారుణ ఘటన చోటుచేసుకోగా శుక్రవారం న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది.

New Update
Crime: బిడ్డ లింగం తెలుసుకునేందుకు భార్య పొట్ట కోసిన దుర్మార్గుడు!

UP Crime: భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ లింగం తెలుసుకునేందుకు ఓ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా ఆమె పొట్టను కొడవలితో చీల్చి రాక్షస చర్యకు ఒడిగట్టాడు. 2020 యూపీలో జరిగిన ఈ దారుణ ఘటన కేసులో కోర్టు సంలచన తీర్పు వెల్లడించింది. ఈ మేరకు బుదౌన్‌ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సౌరభ్ సక్సేనా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

ఈ మేరకు కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బదౌన్ సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటున్న పన్నా లాల్, అనిత దంపతులకు వివాహం జరిగి 22 ఏళ్లు అయింది. వారికి అప్పటికే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. మరోసారి గర్భం దాల్చిన తన భార్యతో మగ శిశువు కోసం పన్ను లాల్ తరచూ గొడవ పడేవాడు. మగబిడ్డను కనకుంటే విడాకులు ఇచ్చి మరో మహిళను వివాహం చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన భార్యతో పుట్టబోయే బిడ్డ లింగం విషయంలో మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన పన్నా లాల్ తన భార్య పొట్టలో ఉన్నది మగ బిడ్డనా లేక ఆడ బిడ్డనా అనేది తెలుసుకునేందుకు కొడవలి తీసుకుని తన భార్య గర్భాన్ని చీల్చాడు.

ఈ క్రమంలో ఈ ఘటనలో కొడవలి కడుపు లోపలి వరకు కోసుకుపోవడంతో ఆమె పేగులు బయట పడ్డాయి. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకున్న అనితను స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనలో అనిత ప్రాణాలతో బయటపడినా బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. అయితే అనిత కడుపులో మగ బిడ్డ ఉన్నట్లు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అతడికి జీవిత ఖైదు విధించింది.

ఇక అనిత సోదరుడు రవిసింగ్ మాట్లాడుతూ.. ఇదంతా ఓ పూజారి చెప్పడం వల్లే జరిగిందని ఆరోపించారు. పన్నాలాల్ కు మగ బిడ్డ కావాలని ఉండేదని అయితే తన సోదరి ఆరవ సారి గర్భం దాల్చినప్పుడు అనిత మరోసారి అమ్మాయిని కనబోతున్నదని ఒక గ్రామ పూజారి చెప్పడం వల్లే పన్నా ఆమెను అబార్షన్ కోసం చాలా ప్రయత్నించాడని చెప్పాడు. అందుకు నా సోదరి ఒప్పుకోలేదని దాంతో అనితను పన్నా నిత్యం కొట్టి హింసించేవాడని, కానీ ఇంత తీవ్రమైన చర్య తీసుకుంటాడని మేము ఊహించలేదన్నాడు. పన్నాకు కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు