🔴Live News Updates: బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు..!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

మద్యం ప్రియులకు ఇది నిజంగా బిగ్ షాక్‌ అనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.  అయినప్పటికీ మందుబాబులు ఎక్కడా కూడా తగ్గకుండా వేసవి రాకముందే బీర్లు తెగతాగేస్తూ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మందుబాబులకు పోలీసులు మరో బిగ్ షాకిచ్చారు.  

మార్చి14వ తేదీన మద్యం షాపులు బంద్

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా మార్చి14వ తేదీన మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.  ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా పోలీసులు ప‌లు కీల‌క సూచ‌నలు, హెచ్చరికలు కూడా చేశారు. 

Also read :  మాతృభాష వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం.. కోర్టు సంచలన తీర్పు

Also Read :  పుచ్చకాయలను ఉదయాన్నే ఇలా తింటున్నారా.. మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

రంగులు చల్లొద్దు, ర్యాలీలు నిర్వహించొద్దు

శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలుగకుండా హోలీ పండగ జరుపుకోవాలన్నారు. ఎవరైనా మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హోలీ సందర్భంగా బీఫ్‌ దుకాణాలను సైతం ఆ రోజు మూసివేయాలని నిర్వాహకులను జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. ఇక హోలీ పండుగ సందర్భంగా దేశంలోని అన్ని విద్యాసంస్థలకు, బ్యాంకులకు సెలవు ఉండనుంది.   

తెలుగు రాష్ట్రాల్లో హోలీ పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. కొందరు  రంగులు చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తే... మరికొందరు గుడ్లు, టమాటాలతో సెలబ్రేట్ చేసుకుంటారు,  

Also Read : కేబీసీకి అమితాబ్ గుడ్ బై..తర్వాత హోస్ట్ గా ఆ ముగ్గురిలో ఒకరు..

Also Read :  గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

  • Mar 13, 2025 21:02 IST

    బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు..!

    బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ అందిస్తామని ప్రకటించారు. దీంతో 2కిలో వాట్ల రూఫ్‌టాప్ కు రూ.80 వేల వరకు సబ్సిడీ అందుతుంది.

    chandrababu



  • Mar 13, 2025 14:32 IST

    డైరెక్టర్ గీతాకృష్ణపై పోలీస్ కేసు!

    డైరెక్టర్ గీతాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ఉమెన్‌ అడ్వొకేట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరారు. సినిమాల్లో నటించే మహిళలపై అసభ్యకరమైన విమర్శలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అశ్లీల పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.

    geetha krishna
    geetha krishna

     



  • Mar 13, 2025 11:30 IST

    సీఎంతో రహస్యంగా భేటీ.. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ కీలక కామెంట్స్!

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.  తెలంగాణలో హిందూవులు సేఫ్‌గా ఉండాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.  బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామానంతా బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ కీలక  కామెంట్స్‌ చేశారు.  

    బుర్ఖాలో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు



  • Mar 13, 2025 08:06 IST

    Telangana: తెలంగాణవాసులకు వాతావరణ శాఖ ముఖ్య సమాచారం.. ఇక ఎండ దంచుడే దంచుడు!

    తెలంగాణ వాసులను భానుడు మార్చిలోనే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం మొదలైన రెండో వారంలోనే గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండగా.. ఈరోజు నుంచి భానుడితీవ్రత మరింత అధికం అంటున్నారు అధికారులు.

    summer
    summer

     

     



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala High Alert :  పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు.

New Update
Tirumala High Alert

Tirumala High Alert

Tirumala High Alert :  జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
కొండపై సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు  టీటీడీ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం వదలకుండా తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘవర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేసింది.

 

 


 Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకమార్గం ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటం, కాశ్మీర్ ఉగ్రదాడితో తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.. దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో భద్రతలను కట్టుదిట్టం చేశామన టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే
 
మరోవైపు ఆక్టోపస్‌ దళం కూడా అప్రమత్తమైంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భ‌ద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. 24 గంటలు సాయుధ బలగాల పహారాలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది.. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment