Vijayawada : విజయవాడలో భారీ వర్షం... విరిగిపడిన కొండ చరియలు! భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. By Bhavana 31 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Heavy Rain : భారీ వర్షాలకు విజయవాడ (Vijayawada) లోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు (Landslides) విరిగిపడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Rama Mohan) ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ దుర్ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా..మరో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఓ బాలిక మృతి చెందినట్లు సమాచారం. పూర్తిగా దెబ్బ తిన్న ఇంట్లో పలువురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. Also Read: ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే! #vijayawada #landslides #moglarajpuram #heavy-rain సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి