Minister KTR: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి!

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు.

New Update
Minister KTR: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి!

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకే రోజు నాలుగు గ్రామాల్లో 378 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను గతంలో నెలకు ఒక సారి సిరిసిల్లకు వచ్చే వాడినన్న ఆయన.. ప్రస్తుతం అలా రావడానికి సమయం ఉండటం లేదన్నారు.

రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధిలో ముందంజలో నిలిపారన్నారు. రాష్ట్రంలో విద్యకు ఎలాంటి ఢోకా లేకుండా స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. 365 రోజులు మంచినీళ్లు, ఉచిత విద్యుత్, సాగునీరు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో గొప్ప పథకాలు తీసుకువచ్చారన్నారు. అందులో రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఉండటంతో ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందన్నారు.

మరోవైపు రైతుల ఖాతాలో ఒకేసారి 73 వేల కోట్ల రూపాయలు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడు పదవుల కోసం కొట్టుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి పదవులపై వారికే గ్యారెంటీ లేదన్నారు. అలాంటి పార్టీ ప్రజలకు గ్యారెంటీ కార్డులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిని ప్రజలు నమ్ముతారని వారు అనుకోవడం వారి కర్మ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లేనిపోని హామీలు ఇస్తూ ప్రజల్ని ఆయోమయానికి గురిచేస్తోందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మన బ్రతుకులు తిరిగి పాత రోజుల్లోకి వెళ్తాయన్నారు. లేనిపోని హామీలు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో డబ్బులు పంచమని అని చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న డబ్బులు తీసుకొని బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండని పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Dilsukhnagar: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబ్ పేలుళ్లపై హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష!

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్‌ షేక్‌కు ఉరిశిక్ష విధించింది.

New Update
Dilsukhnagar bomb blast case High Court sentences five to death

Dilsukhnagar bomb blast case High Court sentences five to death

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఊహించని తీర్పు వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్‌ షేక్‌కు ఉరిశిక్ష విధించింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

ఏం జరిగిందంటే?

2013లో దిల్‌సుఖ్‌నగర్‌‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో 18 మంది మృతి చెందారు. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 2016లో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

అయితే, కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ శిక్షను సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. నేడు తుది తీర్పు ఇచ్చింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థిస్తూ వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

157 మంది సాక్ష్యులు..

21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్‌‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ ఘటనలో అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, ఎజాజ్‌ షేక్‌, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 

 

latest-telugu-news | telugu-news | dilsukhnagar-bomb-blast | today-news-in-telugu | latest telangana news | telugu crime news

Advertisment
Advertisment
Advertisment