అదంతా అబద్ధం.. ఎందుకిలా చేశారో అర్థం కావట్లేదు : కృతి ఎమోషనల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫేక్ వీడియోపై బాలీవుడ్ నటి కృతి సనన్ స్పందించింది. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో నాకు అనుబంధం ఉన్నట్లు రాశారు. ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. అది పూర్తిగా అవాస్తవం. దీనిపై లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.

New Update
అదంతా అబద్ధం.. ఎందుకిలా చేశారో అర్థం కావట్లేదు : కృతి ఎమోషనల్

బాలీవుడ్ నటి కృతి సనన్ తనకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోపై స్పందించింది. ఈ మధ్య కాలంలో ఫేక్ వీడియో, ఆడియోలు తమతోపాటు జనాలను కలవరపెడుతున్నాయని చెప్పింది. ఇటీవలే నటీనటుల డీప్ ఫేక్ వీడియోలతోపాటు పిక్స్ కూడా తమ ప్రమేయం లేకుండానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, తాను ఓ విషయంపై మాట్లాడకపోయినా కావాలని కెరీర్ కిల్ చేసేందుకు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ వాపోయింది.

ఈ మేరకు 'బాలీవుడ్‌ ఓ టాక్‌షోలో నేను ట్రేడింగ్‌ మాధ్యమాలను ప్రోత్సహించాలని చెప్పినట్లు వార్తలొచ్చాయి. కొన్ని వార్తాపత్రికలు నేను మాట్లాడని వాటిని ప్రచారం చేశాయి. ఆ కథనాలు పూర్తిగా అవాస్తవం. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో నాకు అనుబంధం ఉన్నట్లు రాశారు. నేను ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు, నివేదికలపై నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నాను. లీగల్ నోటీసులు జారీ చేశాను. ఇలాంటి తప్పుడు రిపోర్టుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఓపోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుంది.

Also read : ఖమ్మంలో కసి తీర్చుకున్న కాంగ్రెస్.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెన్నులో వణుకే

ఇలావుంటే.. ఇటీవల జాతీయ ఉత్తమనటుడిగా అవార్డును అందుకోవడంపై మాట్లాడిన నటి.. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని చెప్పింది. ‘అల్లు అర్జున్‌ను తొలిసారి నేషనల్‌ అవార్డుల ఫంక్షన్‌లో చూశాను. కాసేపు మాట్లాడినా చాలు.. ఎవరైనా అతని అభిమానులు అయిపోతారు. తను అద్భుతమైన నటుడేకాదు, అద్భుతమైన వ్యక్తి కూడా. బన్నీతో కలిసి పనిచేసే క్షణాలకోసం ఎదురు చూస్తున్నాను. మా ఇద్దరికీ తగ్గ కథను ఎవరైనా దర్శకుడు తయారు చేయాలని, అది తర్వగా జరగాలని కోరుకుంటున్నా’ అని అశాభావం వ్యక్తం చేసింది కృతి సనన్‌. ఇక సినిమాల విషయానికొస్తే.. ఉత్తమ నటిగా ఈ ఏడాది జాతీయ అవార్డును అందుకున్న కృతి ఇటీవల ‘గణపథ్‌: ఎ హీరో ఈజ్‌ బోర్న్‌’తో ప్రేక్షకులను పలకరించింది. టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించిన ఆ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ప్రస్తుతం కృతి బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు