యాప్ పేరిట ఘరానా మోసం.... రూ. 15 కోట్లకు కుచ్చు టోపి పెట్టిన మోసగాళ్లు...!

ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం(cheating) చోటు చేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీం పట్నంలో ఆన్ లైన్ యాప్(online app) పేరిట ప్రజలను మోసగాళ్లు బురిడీ కొట్టించారు. కొండపల్లి(kondapalli)కి చెందిన వ్యక్తులకు మోసగాళ్లు ఏకంగా రూ. 15 కోట్లకు కుచ్చు టోపీ పెట్టారు. యాప్ సరిగా పని చేయక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితులు లబోదిబో మన్నారు. చివరకి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.

New Update
యాప్ పేరిట ఘరానా మోసం.... రూ. 15 కోట్లకు కుచ్చు టోపి పెట్టిన మోసగాళ్లు...!

ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం(cheating) చోటు చేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీం పట్నంలో ఆన్ లైన్ యాప్(online app) పేరిట ప్రజలను మోసగాళ్లు బురిడీ కొట్టించారు. కొండపల్లి(kondapalli)కి చెందిన వ్యక్తులకు మోసగాళ్లు ఏకంగా రూ. 15 కోట్లకు కుచ్చు టోపీ పెట్టారు. యాప్ సరిగా పని చేయక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితులు లబోదిబో మన్నారు. చివరకి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.

కొండపల్లికి చెందిన కృష్ణ అనే వ్యక్తి ప్రస్తుతం బెంగళూరులో వుంటున్నాడు. రాజు మాటలు నమ్మిన కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని కుటుంబాలు ఓ యాప్(maersk)లో పెట్టుబడులు పెట్టాయి. మొదట్లో వారం... వారం రూ. 1500 నుంచి రూ. 2000 వరకు బాగానే డ్రా అయ్యేవి. దీంతో బాధితులు రూ. 40,000, లక్ష రూపాయలు ఇలా పెట్టుబడులు పెంచుతూ పోయారు.

ఒకే కుటుంబంలో నలుగురి పేరుతో యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. భార్య పుస్తెలు తాకట్టు పెట్టి ఒకరు... జీవనాధారమైన ఆటోను అమ్మి మరొకరు.... కాయ కష్టం చేసి మరికొందరు ఇలా లక్షలు యాప్ లో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత యాప్ పూర్తిగా పని చేయలేదు. దీంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. వెంటనే తమతో పెట్టుబడులు పెట్టించిన కృష్ణకు ఫోన్ చేశారు.

కానీ అప్పటికే కృష్ణ ఫోన్ స్విచ్ ఆప్ చేశాడు. దీంతో బాధితులు ఆందోళన చెందారు. బాధితులు వాడుతున్న యాప్‌లో ఆ కంపెనీ పేరు ఉండటాన్ని బాధితులు గమనించారు. రహదారిపై వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం పై ఆ కంపెనీ పేరును బాధితులు గుర్తించారు. కంటైనర్ లారీని అడ్డగించి డ్రైవర్ ను బాధితులు నిలదీశారు. డ్రైవర్ ను పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తాగుబోతు భర్తకు డిఫరెంట్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన భార్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి ఆయన వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు.

New Update

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రేపు సిట్‌ విచారణకు వస్తానని ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ హాయంలో ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఈ మేరకు సిట్ కూడా ఏర్పాటు చేసింది. కొంత మందికి లబ్ధి చేకూరేలా లిక్కర్ పాలసీ, ట్రాన్స్ పోర్ట్, టెండర్లలో మార్పులు చేసినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. దాదాపుగా రూ. 18,860 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.

కసిరెడ్డిదే కీలక పాత్ర..

ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు నిర్దారణకు వచ్చిన సిట్.. ఇప్పటికే ఆయనకు పలు మార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన స్పందించలేదు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ అయిన కసిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఓ ఆడియో విడుదల చేశారు. రేపటి సిట్ విచారణకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారు. 

అయితే.. దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. ఆయనను పలు అంశాలపై విచారించి రేపు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ కసిరెడ్డి విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

(telugu-news | telugu breaking news | latest-telugu-news | ap liquor scam)

Advertisment
Advertisment
Advertisment