Kolkata: అభయ అత్యాచార కేసులో పోలీసుల హస్తం? వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

జూనియర్ డాక్టర్‌ అభయ అత్యాచారం కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడు సంజయ్‌ రాయ్‌తో పోలీసులకు సన్నిహిత సంబంధాలున్నట్లు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. పోలీస్ కమిషనర్ పేరుతో రిజిస్టర్‌ అయిన బైక్‌పైనే తిరుగుతున్నట్లు సంజయ్ అంగీకరించాడు.

New Update
Kolkata: హత్యకు ముందు కూడా మరో మహిళపై వేధింపులు‌‌..

Kolkata case: కోల్‌కతా జూనియర్ డాక్టర్‌ అభయ అత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్‌రాయ్‌తో పోలీసులకు సన్నిహిత సంబంధాలున్నట్లు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. పోలీస్ కమిషనర్ పేరుతో రిజిస్టర్‌ అయిన బైక్‌పై కొంతకాలంగా సంయజ్ తిరుగుతుండగా.. ఘటన జరిగిన రోజు అదే బైక్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు సంజయ్ అదే బైక్‌పై రెడ్‌లైట్‌ ఏరియాల్లోనూ తిరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఇక 2014 మేలో బెల్టాలా RTO కమిషనర్ ఆఫ్ పోలీస్ కోల్‌కతా పేరుతో బైక్ రిజిస్టర్‌ అయినట్లు తెలిపారు.

కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం..
మరోవైపు కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. జూనియర్ డాక్టర్‌ అభయ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిసరస ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగానే నబన్న మార్చ్‌ పేరిట విద్యార్థి సంఘాలు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. అయితే పెద్ద ఎత్తన తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. దీంతో తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసు బలగాలు వెంటనే విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. అయినా స్టూడెంట్స్ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వాటర్‌ కెనాన్స్‌, బాష్పవాయువు ప్రయోగించారు.

ఇది కూడా చదవండి: TG DSC: తెలంగాణలో మరో డీఎస్సీ.. టెట్‌ పరీక్షకు ప్రణాళిక ఖరారు!

ఈ క్రమంలోనే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసనకారులను అడ్డుకునేందుకు సచివాలయాన్ని అష్టదిగ్బంధం చేశారు. 6 వేల మంది పోలీసులతో మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికెడ్లను అడ్డుగా పెట్టారు. అయినా నిరసనకారులు దూసుకురావడంతో వెంటనే స్పందించిన గవర్నర్ సీవీ ఆనంద్ బోస్.. విద్యార్థుల శాంతియుత ర్యాలీని అణిచివేయవద్దని పోలీసులను కోరారు. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని.. మమతా బెనర్జీ ప్రభుత్వానికి సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment