Kodali Nani: చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నాడు.. కొడాలి నాని విమర్శనాస్త్రాలు పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే.. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి MLA Kodali Nani: పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే.. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీల నేతలకు.. పచ్చ మీడియా పెద్దలకే గౌరవ మర్యాదలు ఆత్మగౌరవం ఉంటుందా.. పేదలకు ఉండదా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రంలోని లక్షలాదిమంది వృద్దులు, వికలాంగులు, వితంతువులు కష్టపడుతున్నారని విమర్శలు గుప్పించారు. Also Read: నా పై హత్యాయత్నం జరిగింది.. ఎమ్మెల్యే అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..! గుడివాడలో నన్ను.. రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎవ్వరూ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నామని పార్టీ కార్యకర్తలు, అభిమానులు తనకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించానని తెలిపారు. అయినా తనపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల వద్దని చెప్పిన... తన కాళ్లు కడిగారని వివరించారు. ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా అని ప్రశ్నించారు. తనను అల్లరి చేయడానికి ఏమీ లేక.. ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. #ex-minister-kodali-nani సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి