Kandula Durgesh: సూర్యప్రకాశ్ కు కందుల దుర్గేష్ వార్నింగ్.. జనసేన గురించి తప్పుగా మాట్లాడితే...

జనసేన పార్టీలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్. వైసీపీలో చేరగానే జనసేనకు ప్రజాస్వామ్యం లేదని చేగొండి సూర్యప్రకాశ్ మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు. వైసీపీ ఆడే మైండ్ గేమ్ ట్రాప్ లో హరిరామ జోగయ్య కూడా పడిపోతున్నారని కామెంట్స్ చేశారు.

New Update
Kandula Durgesh: సూర్యప్రకాశ్ కు కందుల దుర్గేష్ వార్నింగ్.. జనసేన గురించి తప్పుగా మాట్లాడితే...

Janasena Kandula Durgesh: జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ (Chegondi Suryaprakash) వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 సీట్లు తీసుకోవటం పై సూర్య ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తి చేస్తూ పార్టీ మారారు.  పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) వైఖరికి నిరసనగా సూర్య ప్రకాష్‌ పార్టీ మారుతున్నట్లు తెలిపారు.

కాగా, హరిరామ జోగయ్య లేఖ, కొడుకు వైసీపీలో చేరికపై జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్ స్పందించారు. ఇప్పటివరకు హరిరామ జోగయ్య (Harirama Jogaiah) తనయుడు తమకు సహచరుడిగా ఇప్పుడు తెర తీశారన్నారు. పార్టీలో ఉన్నంతకాలం బాగుందని చెప్పి ఇప్పుడు బాగోలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జనసేనలో ఉన్నప్పుడు వైసీపీ గురించి ఏం మాట్లాడారో మీకే తెలుసని అన్నారు. పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత పార్టీ అంతర్గత విషయాలు.. పార్టీని దూషించే విధంగా మాట్లాడకూడదని ఎందుకు ఆలోచన చేయడం లేదని నిలదీశారు.

Also Read: వైసీపీలోకి భూమా ఫ్యామిలీ.. భూమా అఖిలప్రియ Vs కిషోర్‌రెడ్డి

జనసేన పార్టీలో (Janasena Party) సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందన్నారు. వైసీపీలో చేరగానే జనసేనకు ప్రజాస్వామ్యం లేదని అని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.  ఎన్నికల సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడటం సమంజసం కాదని హెచ్చరించారు. గతంలో జనసేన అభివృద్ధి అని చెప్పిన హరి రామ జోగయ్య ఇప్పుడు మాట మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. విద్యులైన హరిరామ జోగయ్య ఆలోచించి ముందుకు వెళ్ళండన్నారు.

వైసీపీ ఆడే మైండ్ గేమ్ ట్రాప్ లో మీరు పడిపోతున్నారని కామెంట్స్ చేశారు. వైసీపీలో ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వం మాత్రమే ఉందన్నారు. స్వయంగా ఈ మాట వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులే చెప్తున్నారన్నారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు నాయకులకే సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదని వ్యాఖ్యానించారు. హరి రామ జోగయ్య వ్యాఖ్యలను విజ్ఞులుగానే స్వీకరిస్తామన్నారు. అయితే, తనయుడు సూర్య ప్రకాష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lady Aghori- Mark Shankar: పవన్ నీ కొడుకు కోసం పూజలు చేస్తున్నా- అఘోరీ సంచలన వీడియో

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని లేడీ అఘోరీ ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అతడి కోసం పూజలు చేస్తున్నానని పేర్కొంది. పిల్లలందరిపై శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. నా వంతు నేను కృషి చేస్తానని ఓ వీడియో రిలీజ్ చేసింది.

New Update


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలిసిన తర్వాత ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు రియాక్ట్ అయ్యారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరీ పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

త్వరగా కోలుకోవాలి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. మార్క్ శంకర్ తో పాటు మరెంతో మంది చిన్న పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాల నుంచి కూడా మిగతా పిల్లలు కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలందరిపై కాళిమాత ఆశిస్సులు, శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి. 

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

ఈ ప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడి గురించి తాను స్పందించడం వెనుక ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కువగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. అందుకే నేను స్పందిస్తున్నాను. దీనిని రాజకీయ కోణంలో చూడకండి. రాజకీయ బురద చల్లకండి. సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా నేను స్పందిస్తాను. వాళ్ల కుటుంబాలకు ఏమైనా నేను స్పందించి రక్షిస్తాను. 

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

పవన్ కళ్యాణ్ గారు మీరేం బాధపడకండి. మళ్లీ మీ కుమారుడు హ్యాపీగా నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. మీరు సరదాగా మీ కుమారుడితో సమయాన్ని గడిపే రోజులు వస్తాయి. నా వంతు నేను కృషి చేస్తాను. పూజలో కూర్చోబోతున్నాను. మీరేం బాధపడకండి. మీరు సనాతన ధర్మం గురించి పోరాడండి. 

Also Read:  చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

(lady aghori | Pawan Kalyan | pawan kalyan son mark shankar | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment