Helicopter Crash: కూలిన హెలికాప్టర్‌...మిలిటరీ చీఫ్‌ దుర్మరణం!

హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలటరీ చీఫ్‌ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు.కెన్యాలోని మిలిటరీ దళాల తనిఖీల కోసం మిలిటరీ చీఫ్ వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

New Update
Helicopter Crash: కూలిన హెలికాప్టర్‌...మిలిటరీ చీఫ్‌ దుర్మరణం!

హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలటరీ చీఫ్‌ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం 2.20 గంటలకు రాజధాని నైరోబికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్గెయో మారాక్వెట్ కౌంటీలో హెలికాఫ్టర్‌ పేలిపోయింది.

వాయువ్య కెన్యాలోని మిలిటరీ దళాల తనిఖీల కోసం మిలిటరీ చీఫ్ వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు. మిలటరీ చీఫ్ మరణంపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో విచారం వ్యక్తం చేశారు. కెన్యా ఓ ధైర్యవంతుడైన సైనిక జనరల్‌ను కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలతో బయటపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వివరించారు.

హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎయిర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను కూడా ఘటనా స్థలానికి పంపించినట్లు తెలిపారు. ఒగొల్లా గతంలో కెన్యా ఎయిర్‌ఫొర్స్ అధిపతిగా ఉన్నారు. ఆ తరువాత డిప్యూటి మిలిటరీ చీఫ్‌గా పదోన్నతి పొందారు. గతేడాది అధ్యక్షుడు రూటో ఆయనను మిలిటరీ చీఫ్‌ గా నియమించారు.

1984లో కెన్యా మిలిటరీలో చేరిన ఒగొల్లా అమెరికాలో ఫైటర్‌ పైలట్‌గా శిక్షణ తీసుకున్నారు. కొంతకాలం పాటు ఎయిర్‌ఫోర్సుకు ఇన్‌స్ట్రక్టర్ పైలట్‌గా కూడా ఉన్నారు.

Also read: ఇరాన్‌ పై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment