Kavya Maran: కావ్య మారన్ కంట కన్నీరు.. రియాక్టయిన అమితాబచ్చన్!

ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో రెండోసారి ఐపీఎల్‌ ఛాంపియన్‌ కావాలన్న ఆ జట్టు కలకలగానే మిగిలింది. దీంతో జట్టు ఓనర్‌ కావ్య మారన్‌ కన్నీరు పెట్టుకున్నారు.దీని పై బాలీవుడు నటడు అమితాబ్ ఇలా స్పందించాడు.

New Update
Kavya Maran: కావ్య మారన్ కంట కన్నీరు.. రియాక్టయిన అమితాబచ్చన్!

Amitabh Bachchan on Kavya Maran: ఐపీఎల్ 2024(IPL 2024) ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత రెండోసారి ఐపీఎల్‌ ఛాంపియన్‌ కావాలన్న ఈ జట్టు కల చెదిరిపోయింది.ఇదే క్రమంలో హైదరాబాద్‌ను ఓడించి కేకేఆర్ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే హైదరాబాద్‌ జట్టు పరాజయం తర్వాత జట్టు ఓనర్‌ కావ్య మారన్‌ కన్నీరు పెట్టుకున్నారు.

అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంపై బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. సన్‌ రైజర్స్‌ ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నట్టు తన బ్లాక్ లో పేర్కొన్నారు.ఈ ఏడాది ఐపీఎల్ లో  హైదరాబాద్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని అమితాబ్ అన్నారు.మ్యాచ్ అనంతరం కావ్య మారన్ కన్నీళ్లు ఆపుకోవడం చూసి, చాలా బాధపడ్డానని అమితాబ్‌ తెలిపాడు.

చెన్నైలో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ పూర్తయిన తర్వాత కోల్‌కతా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఆ సమయంలో కెమెరాలు స్టాండ్స్‌లో ఉన్న SRH ఓనర్‌ కావ్యని ఫోకస్‌ చేయగా..ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్టు కనిపించింది.

Also Read: తెరపై ఒకరు తెరవెనక మరొకరు.. కేకేఆర్ విజయంలో వీరిద్దరిదే కీలకపాత్ర !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment