Emergency: 'ఎమర్జెన్సీ' మరోసారి వాయిదా.. కంగనా ఎమోషనల్ పోస్ట్..!

కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరో సారి వాయిదా పడింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ నెల 6న రిలీజ్ కానున్న మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని కంగనా తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

New Update
Emergency: 'ఎమర్జెన్సీ' మరోసారి వాయిదా.. కంగనా ఎమోషనల్ పోస్ట్..!

Emergency: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఎమర్జెన్సీ పీరియడ్ లో దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని.. చివరికి సెప్టెంబర్ 6న విడుదల చేయాలని ప్లాన్ చేయగా మరో సారి వాయిదా పడింది.

ఎమర్జెన్సీ మరోసారి వాయిదా

ఇక ఇప్పుడు సెప్టెంబర్ 6న కూడా ఈ చిత్రం విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని కంగనా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కంగనా తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చింది.. "బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నాను, నేను దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' వాయిదా పడింది. సెన్సార్ బోర్డ్ నుంచి సెన్సార్ సెర్టిఫికెట్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నాము. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది."

అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పై (CBFC) సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే సినిమాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసే సెన్సిటివ్ కంటెంట్ ఉన్నట్లు సెన్సార్ బోర్డు సూచించింది. మరో వైపు సిక్కుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలోని సన్నివేశాలు చిత్రీకరించారంటూ ఢిల్లీ సిక్కు మేనేజ్మెంట్ కమిటీ శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది. దీంతో ఈ సినిమాకు ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో మేకర్స్  చిత్రం మరోసారి 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: Mokshagna Nandamuri: హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మూవీ ఫస్ట్ లుక్.! - Rtvlive.com

#emergency-movie #emergency-post-pone
Advertisment
Advertisment
తాజా కథనాలు