Breaking: కంగనా రనౌత్కు జవాన్ చెంపదెబ్బ.. హిమాచల్ప్రదేశ్లో మండి నుంచి ఎంపీగా గెలిచిన నటి కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. కంగనా ఢిల్లీకి వెళ్తుండగా చండీఘర్ విమానశ్రయంలో ఓ సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. గతంలో రైతులను ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలకు గాను వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 06 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి హిమాచల్ప్రదేశ్లో మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కంగనా ఢిల్లీకి వెళ్తుండగా.. చండీఘర్ విమానశ్రయంలో ఆమెకు, కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్కు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ మహిళా జవాన్.. కంగానా చెంపపై కొట్టారు. గతంలో కంగానా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read: RTV చేతిలో లోకేష్ రెడ్ బుక్ .. సిరీస్-1లో ఐదుగురి పేర్లు.. ఎవరెవరున్నారంటే? ఢిల్లీకి చేరుకున్న అనంతరం కంగనా రనౌత్.. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నినా సింగ్, సీనియర్ అధికారులను కలిసి తనకు జరిగిన చేదు అనుభవంపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మహిళా జవాన్ కుల్విందర్ కౌర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. #KanganaRanaut slapped by a CISF constable, Kulwinder Kaur. She was upset with Kangana's comments on farmers. pic.twitter.com/kK9Tnfxt8m — Lakshminarayana Varanasi (@lnvaranasi) June 6, 2024 #kangana-ranaut సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి