రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.!

"గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది" అనే నిరసన కార్యక్రమం చేపట్టిన టీడీపీ జనసేన నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదంటూ ధ్వజమెత్తారు.

New Update
రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.!

MLA Siddareddy: టీడీపీ జనసేన ఉమ్మడిగా నిర్వహించిన "గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది" అనే నిరసన కార్యక్రమం తీవ్రంగా స్పందించారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో గత 30 సంవత్సరాలలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి చేసామన్నారు. వారి సహకారంతో అధికారంలోకి వచ్చిన కేవలం మూడు నెలల కాలం నుండే కదిరి ప్రజల స్వప్నంగా మిగిలిపోయిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి రూ.230కోట్లతో త్వరలోనే పూర్తి చేయబోతున్నమన్నారు.

ఈ క్రమంలోనే మాట్లాడుతూ.." కాలేజీ సర్కిల్ నుండి చావడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేశాం, కదిరి మున్సిపాలిటీలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించాం, 18 కోట్ల రూపాయలతో స్థానిక ఏరియా ఆసుపత్రి నందు అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుంటున్నాం, మున్సిపల్ కౌన్సిల్ హాల్ ను నిర్మించాం, ప్రతి వార్డులో ఇంటర్నల్ రోడ్లను వేసాం, ఇంకను గడపగడప కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షలతో పనులు చేపట్టమన్నారు.

Also Read: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై మంత్రి అప్పలరాజు రియాక్షన్‌ ఇదే.!

కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా వెక్షించి 150 గ్రామాలకు పైగా తారు రోడ్లను, సిమెంట్ రోడ్లను వేసామన్నారు. 63 సచివాలయాల పరిధిలో సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను, వెల్నెస్ సెంటర్లను నిర్మించాం, నిర్మించుకోబోతున్నామన్నారు. 70 సంవత్సరాల ముందు నిర్మించిన తలుపుల నంబులపూలకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థానంలో నూతన భవనాలను నిర్మించుకుని ప్రారంభించుకున్నామన్నారు.

నాడు నేడు కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో గల ప్రతి పాఠశాలను ప్రతి వైద్యశాలను ఆధునికరించుకున్నామని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలలో ఎన్నడైనా కార్యక్రమాలు చేశారా అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎక్కడైనా కూడా గంపడు మట్టి వేశారేమో ఆలోచించుకోండి! రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పనులు చేయలేదని గుంతలు ఉన్నాయి చెప్పడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment