Kadapa Crime : సెల్ ఫోన్ దొంగతనం.. సీనియర్ల నిందకు బలైన విద్యార్థిని..!

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. సెకండ్ ఇయర్ చదువుతున్న జమీషాఖురేషి బాత్రూంలోని వాటర్ వైపుకు చున్నీతో ఉరేసుకొని చనిపోయింది. సీనియర్లు ఫోన్ దొంగిలించావని నింద వేయడంతో మనస్థాపానికి గురైన జమీషాఖురేషి సూసైడ్ చేసుకుంది.

New Update
 Gujarat Accident

Student Suicide Idupulapaya IIIT: కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ(Idupulapaya IIIT) కళాశాలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్థం లేని అనుమానం నిండు ప్రాణాన్ని బలిచేసింది. కాలేజీలోని సీనియర్లు ఫోన్ దొంగిలించావని తన పై వేసిన నిందను తట్టుకోలేక ప్రాణం తీసుకుంది ఓ అమాయకురాలు.

ప్రాణాలు తీసిన అనుమానం

ఇడుపులపాయ ఒంగోలు క్యాపస్ కు చెందిన జమీషాఖురేషి ట్రిపుల్ ఐటీ రెండవ సంవత్సరం చదువుతుంది. అయితే మంగళవారం మధ్యాహ్నం కాలేజీ క్యాంటీన్ వద్ద ఫైనల్ ఇయర్ కు చెందిన విద్యార్థిని మొబైల్ పోవడంతో... సీనియర్లు సెకండ్ ఇయర్ విద్యార్థిని జమీషాఖురేషినే ఫోన్ దొంగిలించినట్లుగా అనుమానించారు. తన పై దొంగతనం నిందవేయడంతో మనస్థాపానికి గురైన జమీషా బాత్రూం లోని వాటర్ పైపుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన అమ్మాయిది ప్రకాశం జిల్లా చీరాలగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం జమీషాఖురేషి మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read : భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment