ఒక్క సమావేశం బిల్ గేట్స్‌ను హైదరాబాద్‌ కు తీసుకువచ్చింది..చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బిలిగేట్స్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు ఇంటర్నెట్ లో ప్రచారం జరుగుతోంది.అయితే గతంలో చంద్రబాబు, బిలిగేట్స్ ను హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారనే విషయంలో వార్త వైరలవుతోంది.

New Update
ఒక్క సమావేశం బిల్ గేట్స్‌ను హైదరాబాద్‌ కు తీసుకువచ్చింది..చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తిరిగి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారని ఇంటర్నెట్‌లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. అక్కడ 175 సీట్లలో తెలుగుదేశం ఒక్కటే 135 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత  ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా హైదరాబాద్‌లో వివిధ టెక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోని అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు నేడు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు  నేరుగా బిల్ గేట్స్ ను మైక్రోసాఫ్ట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. 2017 AP AgTech సమ్మిట్‌లో, చంద్రబాబు నాయుడు 1990వ దశకంలో బిల్‌క్యాట్స్‌తో తన సమావేశం జరిగినప్పుడు ఏమి జరిగిందో వేదికపై పంచుకున్నారు. ‘బిల్‌గేట్స్‌ ఏదో పని నిమిత్తం ఢిల్లీకి వచ్చారని సమాచారం అందింది. వెంటనే ఆయన్ను కలవడానికి అపాయింట్‌మెంట్‌ అడిగాను. అయితే ఆయన చాలా బిజీగా ఉన్నారని ఆయన పీఏ  చెప్పారు. మీరు  కలవాలనుకుంటే, సాయంత్రం పార్టీకి హాజరు కావచ్చని బిలిగేట్స్ నాకు చెప్పారు. ఈ అవకాశాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేనని ఆయనకి నేను చెప్పాను.

మొదట బిల్ గేట్స్ నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు. అయితే, నా ప్రెజెంటేషన్‌ను చూసిన బిల్ గేట్స్ చివరకు 40 నిమిషాల పాటు ఓపికగా విన్నారు. అమెరికా కాకుండా బయట ఎక్కడు మైక్రోసాఫ్ట్  కేంద్రాన్ని ప్రారంభిస్తే మొదట హైదరాబాద్ లోనే ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. : ఆయన చెప్పినట్లు మైక్రోసాఫ్ట్ తన డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడమే కాదు..మా ఊరికి చెందిన సత్య నాదెళ్ల ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. బిల్ గేట్స్ మధ్య 1990వ దశకంలో సమావేశం జరిగింది. ఆ తర్వాత 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్‌ గా ప్రారంభమైంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment