Kiran Rayal: అడుగడుగునా అక్రమాలు, అవినీతి, దోపిడి.. కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు.! పవన్ కల్యాణ్ అంటేనే బ్రాండ్ అంటూ జనసేన నేత కిరణ్ రాయల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కానివ్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన జగన్, వారి అనుచరులు ఇప్పడు ఏమంటారు అని ఎద్దేవ చేశారు. వైసీపీ పాలనలో టీటీడీలో అడుగడుగునా అక్రమాలు, అవినీతి, దోపిడి జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 14 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Janasena Kiran Rayal: పవన్ కల్యాణ్ అంటేనే బ్రాండ్ అంటూ తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ కామెంట్స్ చేశారు. తమ అధినేత డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కావడంపై జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు వైసీపీ పెద్దలు పవన్ కల్యాణ్ ను ఎమ్మెల్యే కానివ్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారని.. ఇపుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వారి అనుచరులు ఏమంటారు అని ఎద్దేవా చేశారు. Also Read: పవన్ కు పంచాయతీ రాజ్, లోకేష్ కు ఐటీ.. ఏపీ మంత్రుల శాఖలివే! టీడీపీ కూటమి గెలిస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారని.. అయితే, 2019లో అవకతవకలతోనే వైసీపీ గెలిచిందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో అడుగడుగునా అక్రమాలు, అవినీతి, దోపిడి జరిగిందని.. ఆడుదాం ఆంధ్రా అంటూ మంత్రి రోజా కోట్ల రూపాయలు దోపిడి చేశారని ఆరోపించారు. #kiran-rayal సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి