Israel Ship Hijack: హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో ఇజ్రాయెల్‌ నౌక హైజాక్‌.. వీడియో వైరల్..

సినిమాను మించిన యాక్షన్ సీన్. వీడియో తీస్తూ నౌకను హైజాక్ చేశారు దుండగులు. టర్కీ నుంచి భారత్‌కు రావాల్సిన ఈ నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ రెబల్స్ హైజాక్ చేశారు. 25 మంది సిబ్బందిని బందీలుగా ఉంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

New Update
Israel Ship Hijack: హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో ఇజ్రాయెల్‌ నౌక హైజాక్‌.. వీడియో వైరల్..

Israel Ship Hijack: హాలీవుడ్‌ సినిమాలో యాక్షన్‌ సీన్‌ను తలపించేలా ఓ కార్గో షిప్‌ను హైజాక్‌(Hijack) చేశారు హౌతీ రెబెల్స్‌. టర్కీ నుంచి భారత్‌కు రావాల్సిన ఈ నౌకను ఎర్రసముద్రంలో యెమెన్‌ హౌతీ రెబెల్స్‌ హైజాక్‌ చేశారు. ఈ షిప్‌లో వేర్వేరు దేశాలకు చెందిన 25మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే తాము ఇజ్రాయెల్‌ నౌకను స్వాధీనం చేసుకున్నామని..అందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్‌ చేశారు హౌతీ తిరుగుబాటుదారులు.

ఎర్ర సముద్రంపై వెళుతున్న గెలాక్సీ లీడర్‌ అనే కార్గో షిప్‌ను ఓ హెలికాప్టర్‌తో వెంబడించారు హౌతీ రెబెల్స్‌. అదునుచూసి షిప్‌పై ల్యాండయ్యారు. తుపాకులతో కాల్పులు జరుపుతూ..కంట్రోల్‌ సెంటర్‌ను ఆధీనంలోకి తీసుకొని నౌకను యెమెన్‌లోని సలీఫ్‌ పోర్టుకు మళ్లించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని..ఇజ్రాయెల్‌ గాజాపై యుద్ధాన్ని ఆపేంతవరకు దాడులు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. షిప్‌లో ఉన్న 25మంది సిబ్బందిని బందీలుగా తీసుకున్నారు. ఐతే ఆ కార్గో షిప్‌ తమది కాదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్‌. బ్రిటీష్‌ కంపెనీకి చెందిన ఈ కార్గో షిప్‌లో ఇజ్రాయెల్‌ కంపెనీ అబ్రహం ఉంగార్‌కు కొంత వాటా ఉంది. ప్రస్తుతం ఈ నౌక జపాన్‌ నిర్వహణలో ఉంది.

ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పైన్స్, మెక్సికోతోపాటు వేర్వేరు దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు. ఐతే ఈ నౌకలో భారతీయులు ఎవరూలేరన్న ఇజ్రాయెల్‌..అంతర్జాతీయ నౌకపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ పర్యవసానాలకు దారితీసే తీవ్రమైన ఘటన ఇది అని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నౌక టర్కీలో బయలుదేరి భారత్ వెళ్తోందని తెలిపింది.

ఈ హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌కు చెందినవారు. వీరిలో ఉన్న షియా ముస్లింలు..ఇరాన్‌ వైపు మొగ్గు చూపుతారు. ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కి మద్దతు తెలుపుతోంది. అందుకే హమాస్‌కి మద్దతుగా ఇజ్రాయెల్‌కి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయెల్ నౌకలు వెళ్తే.. దాడులు చేస్తామని హౌతీలు ఇదివరకే ప్రకటించారు. వాళ్లు చెప్పినట్లుగానే.. గెలాక్సీ లీడర్ నౌకను హైజాక్ చేశారు. ఐతే అది ఇజ్రాయెల్‌కు చెందింది కాదని..జపాన్‌ నిర్వహణలో ఉందని తెలిసినా, ఇంతవరకు నౌకను విడుదల చేయలేదు. దీంతో అటు ఇజ్రాయెల్‌, ఇటు హౌతీ రెబల్స్‌తోనూ చర్చలు జరుపుతోంది జపాన్‌. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో..ఎర్రసముద్రంలో కార్గో షిప్‌ హైజాక్‌ అవడం మాత్రం సంచలనంగా మారింది.

Also Read:

నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..

ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment