Play Off Race : ఆసక్తి కరంగా మారిన ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్..

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్లేఆప్ రేస్ ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే ముంబై జట్టు ఎలిమినేట్ కాగా వరసుగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన బెంగళూరు టీమ్ ప్లేఆఫ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

New Update
Play Off Race : ఆసక్తి కరంగా మారిన ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్..

IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) ఈ సీజన్‌లో, ప్లేఆఫ్ కోసం పోటీపడే జట్లకు సంబంధించి ఇప్పటి స్పష్టత కనిపించటం లేదు. ఇందులో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు 16 పాయింట్లకు చేరుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) ప్లేఆఫ్స్‌ ను చేరుకున్నట్టు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2024(IPL 2024) లో ఇప్పటివరకు అన్ని జట్లు 10-10 మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కోల్‌కతా 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చెరో 12 పాయింట్లు సాధించాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 10 పాయింట్లతో ఉన్నాయి. దీంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ 8 పాయింట్లు సాధించాయి. ముంబై ఇండియన్స్ ఖాతాలో కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

టోర్నమెంట్‌లో పాల్గొనే 10 జట్లలో 7 జట్లు 16 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ సాధించే అవకాశం ఉంది . ఇందులో రాజస్థాన్ ఇప్పటికే 16 పాయింట్లు సాధించింది. కోల్‌కతా, హైదరాబాద్, లక్నో మరియు చెన్నై 10 మ్యాచ్‌లు ఆడగా, మిగిలిన 4 మ్యాచ్‌లలో గెలవడం ద్వారా 16 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో ముందుకు సాగవచ్చు. ఢిల్లీ, పంజాబ్ జట్లు మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే 16 పాయింట్లకు చేరుకోవచ్చు.

అయితే ముంబై కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలవటంతో ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బెంగళూరు వరసుగా మూడు మ్యాచ్ లు గెలిచి ప్లేఆప్స్ అవకాశాలు తగ్గిపోలేదు.అనే సంకేతాలు పంపించింది. ఏదైనా అదృష్టం జరిగితే తప్ప బెంగళూరు ప్లేఆఫ్స్ వెళ్లే మార్గాలు కనిపించటం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ కొందరు సామాజిక మాధ్యమాలలో జరిగబోయే జట్లు ఓటములు ముందుగా అంచనా వేసి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందని వారు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HMD Barbie Phone: రూ.7,999లకే డబుల్ డిస్‌ప్లే ఫోన్.. సేల్ ప్రారంభం!

HMD బార్బీ ఫోన్‌ ఇటీవల భారతదేశంలో లాంచ్ అయింది. ఇవాళ అంటే ఏప్రిల్ 21 నుండి ఈ ఫోన్ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ దీని ధరను రూ.7,999గా నిర్ణయించింది. HMD ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

New Update
HMD Barbie Phone

HMD Barbie Phone Photograph: (HMD Barbie Phone)

స్మార్ట్‌ఫోన్ కంపెనీ HMD గత నెలలో భారతదేశంలో HMD బార్బీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇవాళ అంటే ఏప్రిల్ 21 నుండి ఈ ఫోన్ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లిప్ ఫోన్‌లో 2.8-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే.. 1.77-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఒకే పింక్ కలర్‌లో వస్తుంది. ఈ బార్బీ ఫోన్‌లో 1,450mAh బ్యాటరీ ఉంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్లు తెలుసుకుందాం. 

HMD Barbie Phone Price

HMD బార్బీ ఫోన్ రూ.7,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి HMD ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఇది పవర్ పింక్ కలర్‌లో మాత్రమే వస్తుంది. HMD బార్బీ ఫోన్ రిటైల్ బాక్స్‌ను బంగారం పెట్టెగా కూడా ఉపయోగించవచ్చు. HMD ఈ ఫోన్‌తో పాటు బార్బీ థీమ్‌తో వెనుక కవర్, స్టిక్కర్లు, పూసల లాన్యార్డ్ పట్టీని అందించింది.

HMD Barbie Phone Specifications

HMD బార్బీ ఫోన్‌లో 2.8-అంగుళాల QVGA ఇన్నర్ డిస్‌ప్లే, 1.77-అంగుళాల QQVGA కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఫోన్ బయటి డిస్ప్లే కూడా అద్దంలా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో యూనిసోక్ T107 ప్రాసెసర్ అందించారు. ఇది 64MB RAM + 128MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు విస్తరించవచ్చు. HMD బార్బీ ఫోన్ S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇది బార్బీ థీమ్ వాల్‌పేపర్‌లు, సంబంధిత యాప్ ఐకాన్‌లతో వస్తుంది.

దీని వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో 0.3 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 1,450mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 108.4 మిమీ పొడవు, 18.9 మిమీ మందం, 55.1 మిమీ వెడల్పు, 123.5 గ్రాములు బరువు ఉంటుంది. బార్బీ ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది వైర్డు, వైర్‌లెస్ మోడ్‌లతో FM రేడియో, MP3 ప్లేయర్‌తో వస్తుంది.

tech-news | telugu tech news | HMD Barbie Flip Phone | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment