Trump : ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నాలు జరగగా తాజాగా మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.శనివారం ట్రంప్‌ ఎన్నికల ర్యాలీకి సమీపంలో ఓ వ్యక్తి షాట్‌గన్, లోడ్ చేసిన ఓ తుపాకీతో పోలీసులకు చిక్కాడు.

New Update
trump

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నెలల నుంచి రోజుల్లోకి వచ్చేశాయి. దీంతో పోటీలో నిలిచిన రిపబ్లికన్‌ అభ్యర్థి, డెమోక్రటిక్‌ అభ్యర్థి కూడా ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నాలు జరగగా తాజాగా మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: హైదరాబాద్ -​ విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

Trump Rally

కాలిఫోర్నియాలో శనివారం ఆయన నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీకి సమీపంలో ఓ వ్యక్తి షాట్‌గన్, లోడ్ చేసిన ఓ తుపాకీతో పోలీసులకు చిక్కాడు. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో ఈ ఘటన జరిగిందని, అక్రమ ఆయుధాలు కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు రివర్‌సైడ్ కౌంటీ పోలీసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: ఏపీలో నేడు మద్యం దుకాణాలు కేటాయింపులు!

నిందితుడిని వెమ్ మిల్లర్‌గా (49) గుర్తించామని, లాస్ వెగాస్‌కు చెందినవాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడని, జనవరి 2న కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ట్రంప్ ర్యాలీకి సమీపంలో చెక్‌పాయింట్‌ను నిర్వహిస్తున్న పోలీసులకు నిందితుడు మిల్లర్ ఎస్‌యూవీ కారులో పట్టుబడ్డాడని, కారును అనుమానస్పదంగా  నడుపుతున్న క్రమంలో అతడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం..4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

నిందితుడు నల్లజాతి వ్యక్తి అని పేర్కొన్నారు. గన్ లోడ్ చేసి ఉండడం, మరోవైపు అతడి వద్ద అధిక సామర్థ్యం కలిగిన మ్యాగజైన్‌ ఉండడంతో దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఇప్పటికే డొనాల్ట్ ట్రంప్‌పై రెండు హత్యాయత్నాల నేపథ్యంలో ఈ తాజా ఘటన వెలుగుచూసింది.

నిందిత వ్యక్తి అరెస్టు గురించి తమకు తెలుసునని, శనివారం జరిగిన ఈ ఘటనలో ట్రంప్‌కి గానీ, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి హాని జరగలేదని ఎఫ్‌బీఐ ప్రకటించింది. నిందిత వ్యక్తిని తాము అరెస్ట్ చేయకపోయినప్పటికీ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. ఈ మేరకు యూఎస్ అటార్నీ కార్యాలయంతో కలిసి ఎఫ్‌బీఐ సంయుక్త ప్రకటన చేసింది.

Also Read: మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే

గతంలో పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్‌పై ఓ యువకుడు కాల్పులు జరపడంతో బుల్లెట్ ఆయన చెవి భాగంలో తగిలి, త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తర్వాత ఫ్లోరిడాలోని తన సొంత గోల్ఫ్ కోర్టులో ట్రంప్‌ ఆడుతుండగా.. ఓ వ్యక్తి ఆయుధాలతో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం

ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. భారత్‌లో రెండు, మయన్మార్, తజికిస్తాన్‌లో ఒక్కోటి వచ్చాయి. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.

New Update
Earthquake

Earthquake

ఈమధ్య వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. మొదటి భూకంపం తజికిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు సమీపంలో రాగా.. ఆ తర్వాత మయన్మార్‌లో మీక్టిలాలో వచ్చింది. అనంతరం భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకశీలో భూకంపాలు వచ్చాయి.   

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. తజికిస్తాన్‌లో భూకంప తీవ్రత 6.0 గా నమోదయ్యింది. భారత్‌లో ఫైజాబాద్‌లో ఉదయం 9 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కేవలం ఒక గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు వచ్చాయి. మయన్మార్‌లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మార్చి 28న అక్కడ 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ బలమైన భూకంపం సంభవించడం కలకలం రేపింది. జనం ఇళ్ల నుంచి భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. 

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

 జమ్ముకశ్మీర్‌లో హిమాలయన్‌ ప్రాంతంలో 4.2 తీవ్రతో భూకంపం రావడంతో అక్కడి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ భూకంపాలు భారత్‌ ప్లేట్‌ యూరేషియన్ ప్లేట్‌తో ఢీకోనడం వల్ల సంభవించే టెక్టోనిక్‌ కదలికల వల్ల సంభవిస్తున్నాయి. ఇదిలాఉడంగా మార్చి 28న మయన్మార్‌ వచ్చిన భూకంప ధాటికి 3600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

telugu-news | rtv-news | earthquake | national-news

 

Advertisment
Advertisment
Advertisment