Soundarya: సౌందర్య అకాలంగా మరణిస్తుందని ముందే తెలుసా.. ఆ యాగాలు చేసింది నిజమేనా!?

పుట్టిన వెంటనే మరణాన్ని ఊహించవచ్చా? నటి సౌందర్య అకాలంగా ఈ లోకాన్ని వీడిచి వెళ్లి ఏప్రిల్‌ 17కు 20ఏళ్లు అవుతుంది. ఆమె మరణాన్ని ముందుగానే ఒక వ్యక్తి అంచనా వేశారని మీకు తెలుసా? ఎవరతను? సౌందర్య గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!

New Update
Soundarya: సౌందర్య అకాలంగా మరణిస్తుందని ముందే తెలుసా.. ఆ యాగాలు చేసింది నిజమేనా!?

 Soundarya:  దాదాపు 10ఏళ్ల పాటు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది సౌందర్య. ఆమె తెలుగింటి అమ్మాయి కాదు.. అయినా అచ్చం అలానే ఉంటుంది. ఎక్స్‌పోజింగ్‌ను నమ్ముకోకుండా టాలెంట్‌ను నమ్ముకున్న ఈ స్టార్‌ హీరోయిన్‌ చీరకట్టులో టాలీవుడ్‌ మనసు దోచింది. కెరీర్‌ పీక్‌ స్టేజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న సౌందర్య 31ఏళ్ల వయసులోనే మరణించింది. నాడు బీజేపీ కోసం ఎన్నికల ప్రచారానికి బెంగళూరు -జక్కూరు విమానాశ్రయం నుంచి కరీంనగర్‌కు సౌందర్య రావాల్సి ఉంది. కరీంనగర్‌ పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో సౌందర్య బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్, మరో వ్యక్తి ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణంలో కుప్పకూలింది. అక్కడికి వెళ్లి చూస్తే మొత్తం మంటలే కనిపించాయి. విమానంలో ఉన్న ముగ్గురూ కాలి బూడిదయ్యారు.

జ్యోతిష్యుడు చెప్పినట్టుగా..
జూలై 18,1971న కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగల్‌ గ్రామంలో సౌందర్య జన్మించారు. ఆమె పుట్టినప్పుడే ఆమె మరణం త్వరగా సంభవిస్తుందని ఓ జ్యోతిష్యుడు చెప్పినట్టుగా పలు మీడియా సంస్థలు చెబుతుంటాయి. ఆమె అకాలంగా మరణిస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడట. అందుకే సౌందర్య తల్లిదండ్రులు నిత్యం పూజలు, యాగాలు చేసేవారని ఆమె సన్నిహితులు అంటుంటారు. దాదాపు 12ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో స్టార్‌ హోదా అనుభవించిన సౌందర్య.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో 100కు పైగ సినిమాల్లో నటించారు. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఆమె తన పేరును సౌందర్యగా మార్చుకున్నారు. డాక్టర్‌ కావాలనుకున్న సౌందర్య MBBSలో జాయిన్ అయ్యారు. అయితే MBBS మొదటి సంవత్సరంలో ఉండగా.. ఆమె తండ్రి స్నేహితుడు, గంధర్వ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అమ్మోరు సినిమాలో నటించారు సౌందర్య. ఈ మూవీ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో సౌందర్య తన చదువును మధ్యలోనే ఆపేశారు.

ఇది కూడా చదవండి:  Vishwak Sen:  గోదావరికి బై చెప్పిన విశ్వక్.. న్యూ లుక్కుతో ట్వీట్..

కెరీర్‌ పీక్స్‌లో ఉండగా..
తెలుగులో నాటి స్టార్ హీరోలందరితో నటించారు సౌందర్య. వెంకటేశ్‌- సౌందర్యది సూపర్‌ హిట్‌ పెయిర్‌గా సినీ లవర్స్‌ అభిప్రాయపడుతుంటారు. రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు లాంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో వెంకటేశ్‌తో జోడీగా నటించి మెప్పించారు సౌందర్య. అటు మెగాస్టార్‌తో సౌందర్య కాంబో కూడా అదిరిపోయేది. ముఖ్యంగా అన్నయ్య సినిమాలో చిరుతో కలిసి కామెడీని పండించారు సౌందర్య. ఇలా కెరీర్‌ పీక్స్‌లో ఉండగా తన మేనమామ, బాల్య స్నేహితుడైన రఘును ఏప్రిల్ 27,2003న పెళ్లి చేసుకున్నారు సౌందర్య. తర్వాత బీజేపీకి ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం ఆ వెంటనే విమాన ప్రమాదంలో మరణించడం సినీ లోకాన్ని విషాదంలో ముంచేసింది. సౌందర్య పార్థివదేహాన్ని చూడటానికి యావత్‌ సినీ లోకం తరలివెళ్లింది. ఈ సమయంలో ఆమె తల లేదని మొండెం మాత్రమే ఉందని సౌందర్య స్నేహితురాలు, నటి ప్రేమ. సౌందర్య చేతి వాచ్‌ చూసి అది ఆమెనని తెలుసుకున్నామని.. జీవితం ఇంతేనా అని ప్రేమ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్‌ అయ్యారు.

#soundarya #death-mystery
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Aamir Khan Mahabharata డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభార...

Aamir Khan Mahabharata డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' అమీర్ భారీ ప్లానింగ్.. రూ.. 1000 కోట్లతో..!

అమీర్ ఖాన్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మహాభారతాన్ని' వెండితెరపై చూపించాలనేది తన కల అని చెప్పారు. ఈ సంవత్సరం దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

New Update
Aamir Khan

Aamir Khan

Aamir Khan:  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం  'సితార్ జమీన్ పర్' సినిమాతో బిజీగా ఉన్నారు. తరచూ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కొత్త అప్డేట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చాలాకాలంగా అమీర్ ఖాన్ అతిగొప్ప ఇతిహాసమైన  'మహాభారతాన్ని' వెండితెర పై చూపించాలని ప్రయత్నిస్తున్నారు. 

'మహాభారతం' నా కల 

ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ..  నేటి తరానికి మహాభరతాన్ని అందించాలనేది తన కల అని  చెప్పారు . ఈ ఏడాది దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీని స్క్రిప్టింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుందని..  ఒకే సినిమాలో స్టోరీ అంతా చూపించలేమని అన్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' తరహాలో  సీరీస్ లుగా అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  ఎంతోమంది డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు సరిపోయే నటీనటుల ఎంపిక చేస్తాము.  అమీర్ ఈ చిత్రంలో నటిస్తాడా లేదా? అని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. 

1000 కోట్ల..

అమీర్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం 2018లో రాకేష్ శర్మ బయోపిక్ నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అమీర్ ఖాన్ దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో  'మహాభారతాన్ని' రూపొందించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

ఇదిలా ఉంటే.. 2022లో 'లాల్ సింగ్ చద్దా' ఊహించని పరాజయంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్న అమీర్.. ప్రస్తుతం ' సీతారే జమీన్ పర్' చేస్తున్నారు. 2007 లో వచ్చిన సూపర్ హిట్ తారే జమీన్ పర్ సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. 

latest-news | cinema-news | Aamir Khan Mahabharat

Also Read: Singer Sunitha: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో.. అసలు నిజం ఇదే!

Advertisment
Advertisment
Advertisment