కజకిస్థాన్ లో చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ! భారత్-చైనా మధ్య విబేధాలు కొనసాగుతున్నవేళ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా మంత్రి వాంగ్ యీని కజకిస్థాన్లో భేటీ అయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 24వ శిఖరాగ్ర సదస్సు కజకిస్థాన్ లోని అస్తానాలో ప్రారంభమైంది. ఈ సదస్సులో వారిద్దరు కరచాలనం చేసుకోవటంతో ఆసక్తి నెలకొంది. By Durga Rao 04 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 24వ శిఖరాగ్ర సమావేశం నిన్న కజకిస్థాన్ లోని అస్తానాలో ప్రారంభమైంది. ఈ సదస్సులో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఆ సదస్సులోనే పాల్గొన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని తో జైశంకర్ సమావేశమైయారు. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల నేతలు సమావేశమవటంతో ఆసక్తి నెలకొంది.ఆ తర్వాత ఇద్దరు కలసి ఫోటో దిగి కరచాలనం చేసుకున్నారు. ఆ సమయంలో సరిహద్దు సమస్యల పరిష్కారంపై ఇరుదేశాల నేతలు కాసేపు చర్చించినట్లు తెలుస్తోంది. #jaishankar సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి