Yuvraj Singh : వెండితెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్.. నటించేది ఎవరంటే?

ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్‌ ఈ బయోపిక్‌ను రూపొందించనుంది. నిర్మాతలు భూషణ్‌ కుమార్‌, రవిభాగ్ చందక్‌ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇందులో హీరోగా ఎవరు కనిపిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Yuvraj Singh : వెండితెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్.. నటించేది ఎవరంటే?

Yuvraj Singh : భారత క్రికెట్ జట్టుకు కీలకమైన ఆటగాడిగా ఎన్నో విజయాలు సాధించిన యువరాజ్ సింగ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్‌ యువీ బయోపిక్‌ను రూపొందించనుంది. నిర్మాతలు భూషణ్‌ కుమార్‌, రవిభాగ్ చందక్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.

యువరాజ్ సింగ్, తన కెరీర్‌లో అనేక రికార్డులు సృష్టించి, భారత క్రికెట్ అభిమానుల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. అతని జీవిత కథలోని అద్భుతమైన ఘట్టాలు, ఆట పట్ల అతని అభిరుచి, అతని కెరీర్‌లో ఎదురైన సవాళ్లు మరియు విజయాలను ఈ బయోపిక్‌లో చూపించబోతున్నారు. యువరాజ్ సింగ్ తన జీవిత కథను తెరపై ప్రదర్శించడం పట్ల ఆసక్తి చూపించాడు. అతను ఈ ప్రాజెక్ట్‌కు సహకరిస్తూ, తన అనుభవాలను తెరపై ప్రతిబింబించడంలో సహాయపడనున్నాడు.

Also Read : మాలీవుడ్‌లో మహిళలకు నరకమే..హేమ కమిటీ రిపోర్ట్‌లో ఆశ్చర్యకర అంశాలు

కాగా ఇందులో యూవీ పాత్రలో హీరోగా ఎవరు కనిపిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 2000లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువరాజ్‌.. సుమారు 17 ఏళ్ల పాటు ఇండియా టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2019లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment