యశస్వి జైస్వాల్ ను మందలించిన మిస్టర్ 360!

టీమిండియా యువబ్యాటర్ యశస్వి జైస్వాల్ ను మిస్టర్ 360గా పిలవబడే సూర్యకుమార్ యాదవ్ హెచ్చరించాడు,‘యశస్వి జాగ్రత్త.. నువ్ తోటల్లో తిరుగుతున్నట్లు .రోహిత్ భాయ్ కు తెలుసా..అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

New Update
యశస్వి జైస్వాల్ ను మందలించిన మిస్టర్ 360!

టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు అమెరికా చేరుకుంది. న్యూయార్క్‌లో టీ20 సిరీస్ కు సిద్ధమవుతోంది. అదే సమయంలో, ఆటగాళ్ళు తమ ఖాళీ సమయాన్ని కూడా ప్రయాణానికి ఉపయోగిస్తున్నారు. యశస్వి జైస్వాల్ కూడా అదే పని చేసి దాని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇది చూసిన సూర్యకుమార్ యాదవ్ ఈ చిత్రాల గురించి యశస్విని సోషల్ మీడియాలో హెచ్చరించాడు.

న్యూయార్క్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలను టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. యశస్వి పోస్టుపై ‘మిస్టర్ 360’ సూర్యకుమార్‌ యాదవ్ స్పందించాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ‘తోటల్లో నడుస్తున్నట్లు ఏంటా నడక అని ఫీల్డర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ మాటలు స్టంప్స్‌ మైకుల్లో ‘స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ‘యశస్వి జాగ్రత్త.. నువ్ తోటల్లో తిరుగుతున్నట్లు రోహిత్‌కు తెలుసా?’ అని సూర్య కామెంట్ చేశాడు. ఈ పోస్టుకు నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan: పవన్ కొడుకు కోలుకోవాలని జనసైనికుల పూజలు,

పిఠాపురంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహిస్తున్నారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో జనసైనికులు, వీరమహిళలు మృత్యుంజయ హోమం జరిపించారు. మార్క్ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

New Update
Special prayers for pawan son mark

Special prayers for pawan son mark

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలంటూ తమ విషెష్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జనసైనికులు పవన్ కుమారుడి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో మృత్యుంజయ హోమం జరిపించారు. అలాగే తాడిపత్రి అపర్ణాదేవి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసైనికులు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ చేసిన మంచే ఆయన కొడుకుకు తిరిగి వచ్చిందని అన్నారు. ఏపీలో పవన్  భవన నిర్మాణ కార్మికులకు చేసిన మేలు.. అదే భవన నిర్మాణ కార్మికుల చేత తన కొడుకును రక్షించేలా చేసిందని తెలిపారు. 

హెల్త్ అప్డేట్ 

ఇదిలా ఉంటే.. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా పవన్ టీమ్  మార్క్ ఆరోగ్యంపై అప్‌డేట్ విడుదల చేసింది.  అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షనలో ఉంచాలని సూచించినట్లు తెలిపారు. స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ చేతికి, కాలికి గాయాలవడంతో పాటు ఉపిరితిత్తులోకి పొగ చేరింది. 

telugu-news | latest-news | pawan kalyan son | pawan kalyan son accident

Advertisment
Advertisment
Advertisment