Smita Sabharwal: సీతక్క మందలించినా తగ్గని స్మితా.. మరో సంచలన ట్వీట్!

సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటా వద్దంటూ వివాదం రేపిన స్మితా సబర్వాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. 'కెరీర్ పబ్లిక్‌లో పుట్టినా.. క్యారెక్టర్‌, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోచ్చు. మీ గొంతును నొక్కివేస్తున్నా ఎప్పుడూ నిజమే మాట్లాడండి' అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

New Update
Smita Sabharwal: సీతక్క మందలించినా తగ్గని స్మితా.. మరో సంచలన ట్వీట్!

Smita Sabharwal: సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల రిజర్వేషన్ పై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలపై ఏ మాత్రం వెనక్కు తగ్గని స్మితా మరో సంచలన పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ‘కెరీర్ పబ్లిక్‌లో పుట్టినా.. క్యారెక్టర్, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోవచ్చు. స్వరం వణుకుతున్న నిజాన్నే మాట్లాడండి’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అయితే ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఈ ట్వీట్ చేశారనే చర్చ మొదలైంది.

ఇక ఇటీవల స్మితా వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క.. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలు తగవని, సామాజిక మాధ్యమాల వేదికగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ ప్యూడల్ భావజాలాన్ని కలిగి ఉన్నారన్నారు. అలాంటి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. ఫిజికల్ ఫిట్ నెస్‎కు సివిల్ అధికారుల పనితీరుకు సంబంధం లేదన్నారు. ఫిట్ నెస్ అనేది దేవుడు ఇచ్చేదని, మానసిక అంగవైకల్యం ఉన్నవారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. ప్రస్తుత సమాజంలో దివ్యాంగులు చాలా విభాగాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment